డార్లింగ్ ప్రభాస్ హీరోగా హిందీలో చేస్తున్న పాన్ ఇండియా మూవీ ఆది పురుష్.ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ చేసినప్పటి నుంచి బి-టౌన్ లో దీనిమీదనే ఎక్కువ చర్చ నడుస్తుంది.
ఒక సౌత్ హీరోగా బాలీవుడ్ అగ్ర దర్శకుడు ఆది పురుష్ లాంటి మైథలాజికల్ కాన్సెప్ట్ తో భారీ బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేయడం అక్కడివారికి ఆశ్చర్యాన్ని కలిగించింది.బాహుబలి, సాహూ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ కెపాసిటీని ఇంకా బిటౌన్ లో తక్కువగానే అంచనా వేయడం విచారించాల్సిన విషయం.
అయితే దర్శకుడు ఓం రావత్ మాత్రం ఆది పురుష్ కథ అనుకున్నప్పుడు తనకి ప్రభాస్ తప్ప మరో అప్షన్ కనిపించలేదని, ప్రభాస్ లేకపోతే ఈ సినిమా ఉండేది కాదని తేల్చేశాడు.
ఇదిలా ఉంటే ఆదిపురుష్ లో ప్రతినాయకుడు లంకేష్ రావణుడు పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటించనున్నట్లు గురువారం చిత్ర యూనిట్ ప్రకటించింది.
దీనిపై స్పందించిన సైఫ్ భార్య, హీరోయిన్ కరీనా కపూర్ తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది.ఈ మేరకు ఇన్స్టాలో ఓ పోస్ట్ చేసింది.సైఫ్ చరిత్రలోనే అత్యంత అందమైన రాక్షసుడు అంటూ కామెంట్ చేసింది.ఇప్పుడు రాముడు, రావణుడు పాత్రల ఎంపిక పూర్తి కావడంతో ఈ సినిమాలోని మరో కీలకమైన సీత పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేయనున్నారు అనే చర్చ మొదలైంది.
ప్రస్తుతం బాలీవుడ్ అందాల భలమైన దీపికా పదుకునే, కైరా అద్వానీ పేర్లు వినిపిస్తూ ఉండగా, సౌత్ నుంచి కీర్తి సురేష్, అనుష్క పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.మరి దర్శకుడు ఎవరిని సీత పాత్రలో ఊహించుకున్నారు అనేది అతని ఎంపిక బట్టి తెలుస్తుంది.