తెలుగులో పలు కామెడీ ఓరియెంటెడ్ మరియు బోల్డ్ తరహా పాత్రలో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ టాలీవుడ్ నటి “కరాటే కళ్యాణి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కాగా కరాటే కళ్యాణి తెలుగులో ప్రముఖ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకులని బాగానే అలరించింది.
అంతే కాకుండా కేవలం చిత్రాల్లో మాత్రమే కాకుండా పలు ధారావాహికలో కూడా నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలలో నటించి బుల్లితెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.అయితే ఈ మధ్య కాలంలో కరాటే కళ్యాణి సోషల్ మీడియా మాధ్యమాలను బాగానే యాక్టివ్ గా ఉంటోంది.
కాగా తాజాగా తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా చేసినటువంటి ఓ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే….
ఈరోజు నాకు కాల్ వచ్చింది.ఎవరో ఒరిస్సా ఎంపీ అంట.నాకు కాల్ చేసి మీరు చేసిన సేవ బావుంది.నేను మూడు సార్లు ఎంపీగా గెలిచాను.
మా ఒరిస్సా నుండి మీకు ఏదైనా సాయం కావాలా.కోట్లు ఇస్తాడట నేనే దొరికేనా రా.గొంతు మార్చి ఒకడే మాట్లాడుతున్నాడు.నాదగ్గర నీ పప్పులు ఉడకవని నేను చెప్పా.
చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు.వాళ్ళకి మీ పేరు మీద ఇచ్చేయండి….
అని నా ఫేస్ బుక్ కూడా చూస్తున్నాడు అంట ఆఎంపీ. చివరాఖరికి నాకు ఒక 10 సార్లు కాల్ చేసి విసింగించి మీకు పెళ్లి అయ్యిందా.? అన్నాడు.
నాకు విషయం అర్థం అయింది.
ఫోన్ కట్ .ఎంపీ గారు నా నంబర్ కోసం విజయశాంతి గారిని అలాగే డీకే అరుణ గారిని కూడా అడిగాడట.ఎందుకో అంత స్పెషల్ ఇంట్రెస్ట్….నేను బీజేపీలో ఏదో పదవి ఉందని మీకు అని కలిపాడు మాట.నేను ఏ పార్టీ లో లేను అని చెప్పి పెట్టేసా.ఇలాంటి వాళ్ళు పొంచి ఉంటారు.
తస్మాత్ జాగ్రత్త.నేను కావాలని మాట్లాడ లేదు.
బిజీ గా ఉన్నా అంటే కూడా వాడు పని మానుకొని మరి నాతో అన్నినార్లు కాల్ చేస్తాడా పిచ్చి ఎంపీ వేరేలా ట్రై చెయ్యి… బ్యాండ్ బాజా బారాత్.అయిపోగలదు.
ఫేస్ బుక్ వల్ల అనుభవాలు .
ఎవ్వరినీ నమ్మకండి” అంటూ పేర్కొంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగులు లేకపోవడంతో కరాటే కళ్యాణి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రజలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది.ఇందులో భాగంగా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినటువంటి పేషెంట్లకు ఉచితంగా భోజనం అందిస్తోంది.
దీంతో కొందరు నెటిజన్లు కరాటే కళ్యాణి చేస్తున్న పనికి అభినందనలు తెలియజేస్తున్నారు.