కన్నడ హీరో నిఖిల్ గౌడ వివాహం అనుకున్నట్లుగానే జరుగబోతుంది.లక్షలాది పెళ్లిలు వాయిదా పడ్డాయి.
ఇలాంటి సమయంలో పెళ్లి అనే పదమే బ్రహ్మ పదార్థం అయ్యింది.పెళ్లిలు అనేవి అసాధ్యం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ పెళ్లికి రెడీ అయ్యాడు.
రేపు బెంగళూరు సమీపంలోని ఒక ఫామ్ హౌస్లో ఈ పెళ్లిని జరుపబోతున్నారు.పెళ్లికి అక్కడి ప్రభుత్వం కండీషన్స్తో కూడిన అనుమతులు ఇవ్వడం జరిగింది.
మొదట నిఖిల్ పెళ్లిని వైభవంగా వంద ఎకరాల స్థలంలో అయిదు లక్షల మంది కార్యకర్తల సమక్షంలో చేయాలని భావించారు. కాని కరోనా కారణంగా మొత్తం ప్లాన్ రివర్స్ అయ్యింది.
కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ పెళ్లిని జరుపబోతున్నారు. అందుకు కూడా ప్రభుత్వం అనుమతిని మొదట నిరాకరించడంతో కుమారస్వామి స్వయంగా రంగంలోకి దిగి ముఖ్యమంత్రి యడ్యూరప్పతో మాట్లాడి కండీషన్స్తో కూడిన అనుమతిని పొందినట్లుగా తెలుస్తోంది.
ప్రతి ఒక్కరు కూడా మాస్క్లు ధరించడంతో పాటు ఖచ్చితంగా సామాజిక దూరం పాటిస్తూ, ఎక్కువ సమయం పెళ్లి హడావుడి లేకుండా కేవలం గంటలోనే ముగించేలా పెళ్లి జరపాలని ప్రభుత్వం ఆదేశించిందట.పెళ్లికి ఇతరులు ఎవరు వచ్చినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారట.బెంగళూరు ప్రస్తుతం రెడ్ జోన్ ఏరియాగా ఉన్న కారణంగా ఇన్ని కండీషన్స్ పెట్టారు. వైభవంగా జరుపుకోవల్సిన పెళ్లి ఇలా చిల్లరగా జరుపుకోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.