‘అర్జున్ రెడ్డి’, ‘గీతాగోవిందం’ చిత్రాలతో మంచి సక్సెస్ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ టాలీవుడ్లొ క్రేజీ హీరోగా మారిపోయాడు.యూత్ ఐకాన్గా విజయ్కు యూత్ నుండి క్రేజీ స్పందన వస్తోంది.
‘నోటా’ చిత్రంతో నిరాశపరిచిన విజయ్ త్వరలోనే మంచి సక్సెస్తో మీ ముందుకు వస్తాను అని మాట ఇచ్చి, చెప్పినట్టుగానే ‘టాక్సీవాలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్తో మాట నిలబెట్టుకున్నాడు.‘టాక్సీవాలా’ విడుదలకు ముందు లీక్ అయినా కూడా మంచి సక్సెస్ను సొంతం చేసుకుంది.
విజయ్కు తెలుగులోనే కాకుండా హిందీలో కూడా భారీ క్రేజ్ ఉంది.విజయ్ దేవరకొండ యాటీట్యూడ్ అంటే తనకెంతో ఇష్టం అని జాన్వీ కపూర్ కాఫీ విత్ కరణ్ షోలో చెప్పిన విషయం తెల్సిందే.దాంతో జాన్వీ విజయ్తో నటించాలని భావిస్తోంది అంటూ వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి.ఇకపోతే కరణ్ అదే షోలో తాను కూడా విజయ్తో ఒక సినిమా చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు.
కరణ్ జోహార్ విజయ్తో ఒక సినిమా ప్లాన్ చేస్తునట్టు తెలుస్తోంది.అయితే అది ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం క్లారిటీ లేదు.
యష్రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా కూడా విజయ్ దేవరకొండతో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టు గతకొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.బాలీవుడ్లో స్టార్ మేకర్స్గా మంచి గుర్తింపు ఉన్న కరణ్ జోహార్ మరియు ఆదిత్య చోప్రాలకు విజయ్ అంటే మోజు.అందుకే ఈ ఇద్దరు విజయ్తో సినిమా చేయడానికి విడివిడిగా ప్లాన్ చేస్తున్నారు.అయితే విజయ్ ఇప్పటికే తెలుగులో బిజీగా మారిపోయాడు.ఈ సమయంలో బాలీవుడ్ ఆఫర్ వస్తే అక్కడికి చెక్కేస్తాడా? లేక ఇంకా కొన్నాళ్లు తెలుగులో చేస్తూ స్టార్డమ్ను సొంతం చేసుకుంటాడా? అనేది చూడాలి.విజయ్ కోసం ఈ బాలీవుడ్ స్టార్ మేకర్స్ ఇప్పటికే వెంటపడుతున్నట్టు తెలుస్తోంది.