ప్రస్తుతం సినిమాల్లో ఎక్కువ బయోపిక్ చిత్రాల కథలే మనకు కనిపిస్తున్నాయి.ఈ క్రమంలో టాలీవుడ్లో వచ్చిన మహానటి, మల్లేశం, ఎన్టీఆర్ వంటి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సెస్ సాధించాయి.
అటు బాలీవుడ్లోనూ ఇదే తరహాలో బయోపిక్ చిత్రాలు తెరకెక్కగా అవి బ్లాక్బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి.ఈ క్రమంలో తాజాగా ఇండియన్ స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితకథను బయోపిక్ చిత్రంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాను ‘83’ అనే టైటిల్తో తెరకెక్కి్స్తున్న చిత్ర యూనిట్, ఇప్పటికే షూటింగ్ పనులు కూడా ముగించుకుంది.కాగా ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాల్సిన చిత్ర యూనిట్, లాక్డౌన్ కారణంగా సినిమాను వాయిదా వేసింది.
ఈ సినిమాలో హీరోగా బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే లాక్డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.
కానీ ఇలాంటి బయోపిక్ చిత్రాలు చాలా అరుదుగా వస్తాయని, వీటిని కచ్చితంగా ప్రేక్షకులు వెండితెరపై చూడాల్సిందే అని చిత్ర దర్శకనిర్మాతలు అంటున్నారు.ఈ క్రమంలో కపిల్ దేవ్ జీవితంలోని అనేక సంఘటనలు, ఆయన భారత్కు క్రికిట్ వరల్డ్ కప్ను ఎలా అందించాడు అనే విషయాలను చిత్ర యూనిట్ మనకు చూపించేందుకు రెడీ అయ్యింది.
మర ఈ సినిమా థియేటర్లలో ఎప్పుడు దర్శనమిస్తుందో చూడాలి.