దేశం లో వరకట్న వేధింపులు కాస్త తగ్గుముఖం పట్టినట్టు అనేక సంస్థలు తమ సర్వేల ద్వారా చెబుతున్నా … నిత్యం ఈ వేధింపుల పర్వం ఎక్కడో ఒక చోట చోటుచేసుకుంటూనే ఉంది.తాజాగా… ఉత్తర ప్రదేశ్లో కట్నం కోసం ఓ ప్రబుద్దుడు కట్టుకున్న భార్య నాలుక కోసేశాడు.అంతే కాదు … ఈ ఘోరం ఎక్కడా … బయటపడకుండా.ఇంట్లోనే బంధించి 15 రోజులుగా దారుణంగా హింసించాడు.చిత్ర హింసలు పెడుతూ.నరకం చూపించాడు.
విషయం ఆ నోటా.ఈ నోటా చేరి.
చివరికి తండ్రికి విషయం తెలియడంతో ఆమెను భర్త చెర నుంచి విడిపించాడు.బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
పూర్తి వివరాలు పరిశీలిస్తే… కాన్పూర్ జిల్లాలోని బర్రా ప్రాంతానికి చెందిన ఆకాష్ కొద్ది రోజులగా భార్యతో తగువులాడుతున్నాడు.అదనపు కట్నం తేవాలంటూ రోజూ భార్యను వేధిస్తున్నాడు.భర్త చిత్రహింసలు పెడుతున్నా.భరిస్తూ ఆమె అత్తింటిలోనే ఉంటోంది.ఈ నెల 6న ఆకాష్ భార్యతో గొడవకు దిగాడు.కట్నం తీసుకోస్తావా లేదా అంటూ ఆమెపై పైశాచికంగా దాడి చేశాడు.
తర్వాత కోపంతో ఊగిపోతూ.కత్తితో భార్య నాలుక కోశాడు.
పాపం భర్త నాలుక కోయడంతో.ఆమె బాధతో విలవిల్లాడిపోయింది.
అయినా భర్త వదల్లేదు.ఆమెను ఓ గదిలో నిర్బంధించి.
రోజూ హింసిస్తూనే ఉన్నాడు.ఈ గొడవ గురించి బాధితురాలి తండ్రికి తెలియడంతో.
నేరుగా అల్లుడి ఇంటికి వెళ్లాడు.నిర్బంధంలో ఉన్న కూతుర్ని విడిపించాడు.
వెంటనే వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.ఆమె కాస్త కోలుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.