ఏపీ విషయంలో బీజేపీ చాలా వేగంగా అడుగులు వేస్తోంది.బలమైన నాయకులను పార్టీలో చేర్చుకోవడంతో పాటు అధికార పార్టీ వైసీపీ మీద విమర్శలకు పదును పెడుతూ ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని రోజు రోజుకి వేగవంతం చేస్తోంది.
వైసీపీ ఈ విషయంలో బీజేపీ మీద ఎదురుదాడి చేయలేక సైలెంట్ గా ఉండలేక సతమతం అవుతోంది.తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి వైసీపీ మీద విమర్శలు గుప్పించారు.
తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీపై చేసిన వ్యాఖ్యలు అందరిని షాక్ కి గురిచేసింది.ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణి చూస్తుంటే గత టీడీపీ ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి పెద్ద తేడా కనిపించడంలేదని విమర్శలు చేశారు.
జగన్ ఎన్నికల ముందు చాలా విషయాలే చెప్పారని, కానీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏమీ చేయలేకపోతోందన్నారు.అలాగే మాత మార్పుళ్లను కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందన్నారు.అసలు ప్రభుత్వాలు కుల,మతాలకు అతీతంగా పనిచేయాలని చెప్పుకొచ్చారు.జగన్ తన పద్దతి మార్చుకోవాలని కన్నా జగన్ కు వార్నింగ్ ఇచ్చారు.లేకపోతే రోడ్డెక్కాల్సి వస్తుందని కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు.ఏపీ లో ఇసుక దొరకడం అతిపెద్ద సమస్యగా మారిందన్నారు.ఒకప్పుడు రూ.10వేలకు దొరికే ఇసుక ఇప్పుడు రూ.20 వేలకు కూడా దొరకడం లేదని, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో సమస్యలు పేరుకుపోయాయన్నారు.జగన్ పరిపాలన విషయంలోనూ, ప్రజా సమస్యల విషయంలోనూ శ్రద్ధపెట్టాలని లేఖ కూడా రాశామని కన్నా చెప్పుకొచ్చారు.
కన్నా ఆరోపణల విషయం పక్కనపెడితే బీజేపీ అగ్ర నాయకులు సైతం జగన్ ను అన్ని రకాలుగా ఇబ్బందిపెట్టేందుకు చూస్తోంది.ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీనే తన రాజకీయ ప్రత్యర్థిగా భావించిన బీజేపీ ఇప్పుడు వైసీపీని కూడా ఆ విధంగానే చూస్తోంది.
ఒకవైపు చంద్రబాబు మరోవైపు జగన్ అన్నట్టుగా బీజేపీ పావులు కదుపుతూ ముందుకు వెళ్తోంది.ప్రస్తుత బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీకి మింగుడుపడంలేదు.అయినా బీజేపీ విషయంలో ముందుకు వెళ్లలేక సతమతం అవుతోంది.ఇదే అదునుగా బీజేపీ విమర్శలు డోసు పెంచి వైసీపీని ఇబ్బందిపెడుతోంది.