కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దేశ వ్యాప్తంగా చాలా ప్రమాదకరమైన రీతిలో ఉంది.ప్రతి రోజు లక్షల్లో కేసులు నమోదు అవుతూ ఉండగా వేళల్లో ప్రజలు మృత్యువాత పడుతున్నారు.
తరతమ బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు కరోనా బారిన పడుతూ ఉందట రూపాంతరం చెందిన కొత్తరకం వైరస్ మరింత ప్రమాదకరంగా మారి చాలా వేగంగా ప్రజల ప్రాణాలు హరించేస్తుంది. సెలబ్రిటీలు కూడా ఈ కరోనా బారిన పడి మృత్యుముఖం చూస్తున్నారు.
గత ఏడాది కొంత మంది ప్రముఖులు కరోనా బారిన పడి చనిపోగా.ఈ ఏడాది దానికి కొనసాగింపుగా నటులు, దర్శకులు, నిర్మాతలు చనిపోతున్నారు.
తాజాగా వెటరన్ స్టార్ హీరోయిన్ మాలాశ్రీ భర్త కన్నడలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న కుణిగల్ రాము కరోనా బారిన పడి మరణించారు.
ప్రేమఖైదీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన మాలాశ్రీ తరువాత కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగి నిర్మాత రాముని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఆమెని లీడ్ రోల్ లో పెట్టి ఫిమేల్ సెంట్రిక్ కథలతో కన్నడంలో హిట్ సినిమాలని రాము నిర్మించారు.వారం రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన బెంగుళూరు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
పరిస్థితి విషమించడంతో ఈ రోజు మృతి చెందారు.ఆయన మరణ వార్తతో కన్నడ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.
ఆయన నిర్మాణంలో సినిమాలు చేసిన స్టార్ హీరోలు సోషల్ మీడియాలో ద్వారా వారి సంతాపం తెలియజేశారు. రాము, మాలాశ్రీ దంపతులకి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.