ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీటమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ చిన్నతనంలో చదువుకున్న ఈ జాతీయ గీతం అందరికి గుర్తు ఉండేఉంటుంది.ఏ దేశంలో ఉన్నా , ఎలా ఉన్నా సరే కన్న తల్లి లాంటి పుట్టిన దేశాన్ని కీర్తించండి, నీ జాతి గౌరవాని కాపాడు అంటూ సాగిన ఈ గీతం ఎంతో మందిలో స్పూర్తి నింపింది.
ముఖ్యంగా భారత దేశంలోని పలు రాష్ట్రాల నుంచీ విదేశాలు వెళ్ళిన ఎన్నారైలు ఎంతో మంది తమ జాతి, తాము పుట్టిన దేశం గర్వపడేలా, తలెత్తుకునేలా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
విదేశాలలోఉన్న మన భారతీయ ఎన్నారైలు అత్యున్నత పదవులు అలంకరిస్తూ భారతీయులు అందరూ గర్వపడేలా ఉన్నత స్థానాలలో కొలువై ఉన్నారు.
అయితే తాజాగా కెనడా పార్లమెంట్ లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది.భారత దేశం గర్వపడేలా మరీ ముఖ్యంగా కన్నడ ప్రజలు అందరూ గర్వపడేలా కన్నడ రాష్ట్రానికి చెందిన ఎన్నారై చంద్ర ఆర్య కెనడా ఎంపీగా ఎన్నికయ్యారు.
అయితే మొదటి సారిగా కెనడా పార్లమెంట్ లో తాను ప్రసంగించే సమయం రావడంతో సభాధ్యక్షుడి అనుమతితో కన్నడ బాషలో ఆయన ప్రసంగించారు.
కన్నడ బాషను 5 కోట్ల మంది మాట్లాడుతారని, కన్నడిగులు ఎక్కడ ఉన్నా సరే కన్నడిగుడిగానే జీవించాలి అనే కన్నడ కవి కువెంపు రాసిన పాటను చంద్ర ఆర్య గుర్తు చేసారు.
కాగా భారత దేశం బయట కన్నడ మాట్లాడిన ఇలాంటి సందర్భాలు లేవని ఏకంగా కెనడా పార్లమెంట్ లో కన్నడం మాట్లాడటం తమకు సంతోషాన్ని ఇచ్చిందని, తామందరం గర్వంగా భావిస్తున్నామని కన్నడిగులు అంటున్నారు.ఇదిలాఉంటే చంద్ర ఆర్య 2015 లో మొట్టమొదరి సారిగా కెనడా పార్లమెంట్ కు ఎన్నియ్యారు.
తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించిన ఆయన కన్నడం లో మాట్లాడి అక్కడి వారిని ఆశ్చర్యపరిచారు.