కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ వైడ్ గా స్టార్ దర్శకుడుగా మారిపోయిన వ్యక్తి ప్రశాంత్ నీల్.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది.
దీని తర్వాత ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సలార్ మూవీ షూటింగ్ పై ఈ దర్శకుడు పూర్తిగా దృష్టి పెట్టబోతున్నాడు.కన్నడ ఇండస్ట్రీలో ఉగ్రం మూవీతో ప్రశాంత్ నీల్ కెరియర్ ప్రారంభించారు.
ఇక రెండో సినిమాగా కేజీఎఫ్ స్టార్ట్ చేసి ఒక్కసారిగా స్టార్ దర్శకుడు కేటగిరీలోకి వెళ్ళిపోయాడు.స్వతహాగా కన్నడ ప్రేక్షకులకి మాతృభాష సినిమాలపై ఎక్కువగా ప్రేమ ఉంటుంది.
ఈ నేపధ్యంలో ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సిరీస్ తర్వాత మళ్ళీ కన్నడ హీరోతోనే సినిమా చేయాలని వారు కోరుకుంటున్నారు.అయితే ఈ దర్శకుడు మాత్రం మూడో సినిమాని టాలీవుడ్ హీరో ప్రభాస్ తో చేస్తున్నాడు.
ఇక తరువాత కూడా కన్నడ హీరోతో చేసే ఛాన్స్ లేదు.దీనికి కారణం ఎన్టీఆర్ తో మూవీని ప్రశాంత్ సెట్ చేసుకున్నాడు. ఇది కంప్లీట్ అయిన తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అర్జున్ తో మరో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు.ఇలా ప్రశాంత్ నీల్ వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోలతోనే సినిమాలని బ్యాక్ టూ బ్యాక్ లైన్ లో పెట్టేసి శాండల్ వుడ్ ని నిర్లక్ష్యం చేస్తున్నాడని అక్కడి వారి ఫీలింగ్.
ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలని కన్నడ స్టార్ హీరోలు అనుకుంటున్నా వారికి ఇప్పట్లో ఆ అవకాశం లేదు.తరువాత ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి.ఈ నేపధ్యంలోనే ప్రశాంత్ నీల్ పై కన్నడ సినిమా అభిమానులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.కన్నడ సినిమా ద్వారా కెరియర్ ప్రారంభించి కన్నడ సినిమాని ప్రశాంత్ నీల్ నిర్లక్ష్యం చేస్తున్నాడని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారు.
దీనికి అతను తగిన మూల్యం చెల్లించుకుంటాడని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.