ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కన్నడ బ్యూటీ “రష్మిక మందన్న” సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.కాగా ఈ అమ్మడు మొదటగా తెలుగులో యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా నటించిన చలో అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయం అయింది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో తెలుగు సినిమా దర్శక నిర్మాతల దృష్టిలో పడి ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది.
అయితే కొద్దికాలంగా ప్రముఖ స్వర్గీయ నటి సౌందర్య బయోపిక్ వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగా స్వర్గీయ నటి సౌందర్య కూడా కన్నడ భాష కి చెందిన నటి కావడంతో యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న సౌందర్య బయోపిక్ లో నటించబోతోందని కొందరు బలంగా చర్చించుకుంటున్నారు.
అయితే ఇందుకు గల కారణాలు లేకపోలేదు ఆమధ్య ఓ ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో రష్మిక మందన్న పాల్గొని సౌందర్య బయోపిక్ పై స్పందించిన ఇందులో భాగంగా తన చిన్నప్పుడు తాను చూడటానికి అచ్చం నటి సౌందర్య లాగా ఉండే దానినని తన తండ్రి అప్పుడప్పుడు చెబుతుండేవాడని దాంతో తనకి నటి సౌందర్య గురించి తెలుసుకోవాలని చాలా ఉత్సాహం ఉండేదని చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత నటి సౌందర్య సినిమాలు చూస్తూ పెరిగానని ఆమె బయోపిక్ లో నటించే అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తానని తన మనసులో మాటను బయట పెట్టింది.
దీంతో అప్పటి నుంచి నటి సౌందర్య బయోపిక్ వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ హల్చల్ చేస్తున్నాయి.అంతేకాకుండా రష్మిక మందన్న సౌందర్య బయోపిక్ లో నటిస్తే చాలా బాగుంటుందని ఇప్పటికే కొందరు సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరి నటి సౌందర్య బయోపిక్ ని తెరకెక్కించే అవకాశం ఏ దర్శకుడు దక్కించుకుంటాడో చూడాలి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ ఏడాది రష్మిక మందన్న సరిలేరు నీకెవ్వరు, సుల్తాన్ తదితర చిత్రాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.కాగా ప్రస్తుతం రష్మిక మందన్న హిందీ తెలుగు తమిళం తదితర భాషలలో హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.కాగా ప్రస్తుతం ఆడవాళ్లు మీకు జోహార్లు అనే బాలీవుడ్ చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది.