సెలబ్రెటీలు తెరపై నవ్వుతూ సందడగా కనిపించిన వారి వ్యక్తిగత జీవితంలో చాలా మంది డిప్రెషన్ కి గురవుతూ ఉంటారు.అవకాశాలు సరిగా రాకపోయిన, అనుకున్న స్థాయిలో గుర్తింపు రాకపోయిన ఒత్తిడికి గురువుతూ ఉంటారు.
అలాగే కస్టపడి చేసిన సినిమా ఫ్లాప్ అయినా కూడా వారు అనవసరమైన డిప్రెషన్ లో లోనవుతూ ఉంటారు.అయితే మనసులో ఎంత డిప్రెషన్ ఉన్న బయటకి మాత్రం మొహంపై చిరునవ్వు పెట్టుకొని అందరిని పలకరిస్తూ ఉండాలి.
అలాగే తెరపై కూడా వారి వ్యక్తిగత జీవితంలో ఒత్తిళ్లు కనిపించకుండా నటించాలి.ఈ ఒత్తిడి తట్టుకోలేక కొంత మంది తారలు అర్ధాంతరంగా వారి తనువు చాలిస్తూ ఉంటారు.
ఇలా డిప్రెషన్ కారణంగానే బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు.తాజాగా కన్నడ భామ కూడా తన డిప్రెషన్ గురించి జీవితం ముగించాలని ఉందంటూ ట్వీట్ చేసింది.
దీంతో ఆమె అభిమానులు కొంత కంగారు పడ్డారు.అయితే తరువాత దానిపై కొంత వివరణ ఇచ్చి వారిని కూల్ చేసింది.
కన్నడ హీరోయిన్ జయశ్రీ రామయ్య జీవితం ముగించాలని ఉందని, ప్రపంచానికి గుడ్ బై చెప్పాలని ఉందంటూ సోషల్ మీడియాలో నిరాశతో కూడిన పోస్ట్ చేసి అందరినీ టెన్షన్ పెట్టింది.నటిగా కంటే కూడా కన్నడ బిగ్ బాస్-3 కంటెస్టెంటుగా ఆమె బాగా పాపులారిటీ సంపాదించుకుంది.
అయితే ఒక్కసారిగా జీవితం ముగించాలని పోస్ట్ చేయడంతో ఆమె అభిమానులు నెటిజన్లు ఆందోళన చెందారు.అయితే కాసేపటికి మళ్లీ జయశ్రీ ఐయామ్ ఆల్రైట్ అండ్ సేఫ్ లవ్ యూ అని పోస్ట్ చేసింది.
ఈ పోస్ట్ చూసాక అంతా కూల్ అయ్యారు.జయశ్రీ గురించి ఆమె ఫ్రెండ్ అశ్రిత శెట్టి మాట్లాడింది.
కొంతకాలంగా జయశ్రీ డిప్రెషన్తో బాధపడుతోంది.ఆమె కుటుంబం నుండి కొన్ని ఇబ్బందులు ఉన్నాయట.
అలాగే ప్రస్తుతం కెరీర్ పరంగా అవకాశాలు లేకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లింది.ఇప్పుడు జయశ్రీ తరచుగా ఫోన్ నంబర్లు మారుస్తుండటంతో ఆమె గురించి తెలుసుకోవడం కష్టం అవుతుంది అని చెప్పింది.
జయశ్రీ గతంలో ఆస్తి విషయంపై తన మేనమామ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని పోలీస్ స్టేషనులో ఫిర్యాదు కూడా చేసింది.దీంతో కుటుంబ వ్యవహారాల కారణంగా, అలాగే అవకాశాలు లేకపోవడం వలన ఆమె డిప్రెషన్ లో ఉన్నట్లు భావిస్తున్నారు.
దీంతో ఆమెని ఫాలో అయ్యేవారు జయశ్రీని కామెంట్లు ద్వారా ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.