ఎలుకలున్నాయని ఇల్లు తగులబెట్టినట్లుంది

ఏపీ సీఎం జగన్‌ మూడు రాజధానులను రాష్ట్రంకు ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించడంతో పాటు అసెంబ్లీలో బిల్లును కూడా తీసుకువచ్చాడు.అమరావతితో పాటు కర్నూలు మరియు వైజాగ్‌లను కూడా రాజధానులుగా ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించాడు.

 Kanna Laxminarayana Comments On Jagan Mohan Reddy And Chandrababu Naidu-TeluguStop.com

బీజేపీ మరియు తెలుగు దేశం పార్టీలు ఈ విషయమై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు జగన్‌కు పెద్దగా తేడా లేదు అని, ఇద్దరు కూడా ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి స్వ ప్రయోజనాల కోసం పాటు పడుతున్నారు అంటూ ఎద్దేవ చేశాడు.

సీఎం జగన్‌ ఇంట్లో ఎలుక దూరిందని ఇల్లును తగులబెట్టినట్లుగా రాజధానిని మార్చాడని, అమరావతి రాజధానిగా ఉంటే బాగుండేది అన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.కన్నా లక్ష్మినారాయణ జగన్‌ తీరుపై తీవ్రంగా మండి పడ్డాడు.

తన నిర్ణయాలను సొంత నిర్ణయాలుగా ప్రకటించుకునే దమ్ము జగన్‌కు లేదన్నాడు.ఆయన నిర్ణయాలను బీజేపీకి ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

అభివృద్ది వికేంద్రీకరణకు బీజేపీ మద్దతు కాని ఇలా పరిపాలన వికేంద్రీకరణకు బీజేపీ అనుకూలం కాదంటూ కన్నా పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube