పాలించడానికి పనికి రాని వైకాపా

అయిదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన వైకాపాపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.అప్పటి నుండి కూడా కలర్స్‌ వేయించడం తప్ప పరిపాలన చేయడంలో వైకాపా విఫలం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 Kanna Laxminarayana Comments On Jagan Governament-TeluguStop.com

గ్రామాల్లో సచ్చివాలయాలకు.ఇంకా కొన్ని కట్టడాలకు కలర్స్‌ వేయిస్తున్నారు.

అది కూడా వైకాపా జెండా కలర్స్‌ వేస్తున్నారు.అంతకు మించి రాష్ట్రంలో జరుగుతున్న పని ఏది కూడా తెలియడం లేదు అంటూ కన్నాలక్ష్మినారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు.

రాష్ట్ర ప్రజలు 150 సీట్లు ఇచ్చి పరిపాలించమని చెబితే ప్రజలకు వీరు రిటర్న్‌ గిఫ్ట్‌గా ఇసుక కొరతను ఇచ్చారంటూ కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇసుక కొరత కారణంగా అత్యంత దారుణమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

గత ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వం చేస్తుందని.మాజీ సీఎం చంద్రబాబు నాయుడు లాగే ప్రస్తుత సీఎం జగన్‌ కూడా వ్యవహరిస్తున్నాడంటూ విమర్శించాడు.

ప్రజల సంక్షేమం పట్ల, అభివృద్ది పట్ట జగన్‌కు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా వెంటనే సమస్యల పరిష్కారంకు సిద్దం అవ్వాలంటూ డిమాండ్‌ చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube