బీజేపీ కార్యకర్తలపై కూడా వైకాపా దాడి

తెలుగు దేశం పార్టీ నాయకులు బొండ ఉమా మరియు బుద్ద వెంకన్నలపై వైకాపా కార్యకర్తలు దాడి చేసినట్లుగా ప్రచారం జరుగుతున్న ఈ సమయంలోనే మరో చోట బీజేపీ నాయకులపై వైకాపా కార్యకర్తలు దారుణాలకు ఒడి గడుతున్నారు అంటూ ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బీజేపీ కార్యకర్తలు స్తానిక సంస్థల ఎన్నిక నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న సమయంలో దాడి చేయడంతో గాయాల పాలయ్యారు.

 Kanna Laxmi Narayana Comments On Ycp Party-TeluguStop.com

ఈ విషయమై బీజేపీ రాష్ట్ర చీప్‌ కన్నా స్పందిస్తూ అభద్రతా భావంతోనే వైకాపా కార్యకర్తలు నాయకులు ఇలా దాడులకు దిగుతున్నారు అంటూ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.ఈ విషయమై వెంటనే ఎన్నికల కమీషన్‌ స్పందించాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

బీజేపీ కార్యకర్తల్లో ముగ్గురు తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది.అయితే ఈ దాడులపై సీఎం జగన్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube