నిన్న మొన్నటి వరకు ఏదో ఒక రూపంలో గుర్తింపు లభిస్తుందని అనుకున్నారు.జాతీయ స్థాయిలో గళం వినిపించాలని భావించారు.
తీరా చూస్తే.ఎలాంటి ప్రాధాన్యమూ దక్కకుండా పోయిందనే ఆవేదన తప్ప మిగిలింది ఏమీ కనిపించడం లేదు- ఇదీ.బీజేపీ రాష్ట్ర మాజీ సారథి, సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గురించి ఆయన అనుచరులు చెబుతున్న మాట.ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఇక, తనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లబిస్తుందని అనుకున్నారు.కానీ, రెండున్నరేళ్ల తర్వాత చూస్తే.
మొత్తం డొల్లే! ఏమీ కనిపించలేదు.ఆయనకు మిగిలింది కూడా ఏమీ లేదు.
పైగా.రాష్ట్ర బీజేపీ కోసం .ఆయన శ్రమను గుర్తించిన నాథుడు కూడా కనిపించలేదు.ఈ పరిణామాలు నిజంగానే కన్నాను కుంగదీశాయని అంటున్నారు.
ఇటీవల ఆయన బీజేపీ రాష్ట్ర పగ్గాల నుంచి పక్కకు తప్పుకొన్నారు.ఈ క్రమంలో రాష్ట్రంలో కీలక పదవి నుంచి దిగిపోయిన ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని అనుకున్నారు.
అయితే, తాజాగా జాతీయ బీజేపీలో 70 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ.బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రకటన జారీ చేశారు.
దీనిలో రాష్ట్రం నుంచి పురందేశ్వరికి అవకాశం లభించింది.అదేవిధంగా ఇప్పటికే జాతీయ కమిటీలో ఉన్న సత్యకుమార్కు రెన్యువల్ దక్కింది.
కానీ, ఎటొచ్చీ.తకు ఏదో ఒక రూపంలో గుర్తింపు లభిస్తుందని భావించిన కన్నా మాత్రం నిరాశతోనే ఉండాల్సి వచ్చింది.మరి దీనికి కారణాలేంటి ? ఆయనకు ఇప్పట్లో గుర్తింపు దక్కదా ? అనే ప్రశ్నలకు సమాధానం కూడా చిక్కడం లేదు.ఆయన చేసుకున్న స్వయంకృతమని చాలా మంది చెబుతున్నారు.
రాజధాని అమరావతి విషయంలోకేంద్రం తమకు సంబంధం లేదని చెప్పినా.కన్నా మాత్రం మోడీ వస్తారు.
మీ ఆశ తీరుస్తారు.అంటూ.
రైతుల్లో మోడీపై ఆశకల్పించారు.
ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లో మెలుగుతున్నారన్న వాదనా ఉంది.
మరోపక్క, పార్టీలో అందరికీ అందుబాటులో లేరని కూడా ప్రచారం జరిగింది. కేంద్రంలో కీలక నాయకుడు జీవీఎల్తో నువ్వా-నేనా అనే రీతిలో ఘర్షణకు దిగారు.
ఇవన్నీ ఆయనను పార్టీలో ఏకాకిని చేశాయనే అంటున్నారు పరిశీలకులు.