అందమైన వివాదాల సుందరి కంగనా రనౌత్ నెక్స్ట్ జయలలిత బయోపిక్ తో రాబోతోంది.కోలీవుడ్ దర్శకుడు ఏఎల్.
విజయ్ తెరకెక్కిస్తున్న స సినిమాలో అమ్మడు మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనుంది.జయలలిత జీవితానికి సంబంధించి మరో మూడు ప్రాజెక్టులు సిద్దమవుతున్నప్పటికీ అందరి చూపు ఎక్కువగా కంగనా నటిస్తున్న సినిమాపైనే ఉంది.
అసలు విషయంలోకి వస్తే.ఈ బయోపిక్ లో ఒక ముఖ్య పాత్ర కోసం సీనియర్ యాక్టర్ అరవింద్ స్వామిని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.అలనాటి తమిళ నటుడు మాజీ ముఖ్యమంత్రి ఎమ్.జి.ఆర్ పాత్రలో ఈ స్మార్ట్ యాక్టర్ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.జయలలిత రాజకీయ జీవితంలో ఎమ్ జిఆర్ పాత్ర చాలా కీలకం.
ఆమె రాజకీయల్లో కోనసాగడానికి ఆయన ఆదర్శంగా నిలిచారు.
ఇకపోతే ముందుగా ఆ ప్రఖ్యాత వ్యక్తి పాత్ర కోసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని ఎంచుకోవాలని అనుకున్నారు.కానీ కథలో అదే కీలకమైన పాత్ర కావడంతో అంచనాలు భారీగా ఉంటాయి.అందుకే అరవింద్ స్వామిని ఎంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ బయోపిక్ కి కథను అందించారు.ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
.తాజా వార్తలు