బాలీవుడ్ లో కంగనా రనౌత్ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారిపోయింది.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఇష్యూని తనకి నచ్చినట్లు వాడుసుకుంటూ బాలీవుడ్ లో తనకి విరోధులైన అందరి మీద విమర్శలు చేస్తుంది.
సోషల్ మీడియాలో నెటిజన్లు నుంచి ఆమెకి మద్దతు రావడంతో మరింతగా నోరు పారేసుకుంటుంది.ఓ విధంగా ఈ మధ్య కాలంలో ఆమె విమర్శలు మరింత శృతి మించుతున్నాయి.
ఇలా అదే పనిగా విమర్శలు చేయడం కరెక్ట్ కాదని తనని హెచ్చరించే వారిని కూడా కంగనా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంది.ఈమె వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్ చాలా మందికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది.
ఇక సుశాంత్ ఇష్యూని కూడా ఆమె ఇష్టానుసారంగా వాడుకోవడంపై సుశాంత్ ఫ్యామిలి లాయర్ కాస్తా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.బాలీవుడ్ పెద్దలు బహిష్కరించడం వల్లే దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ కంగనా రనౌత్ చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు.
అవన్నీ కేవలం ఆమె సొంత అభిప్రాయాలు మాత్రమేనని లాయర్ వికాస్ సింగ్ పేర్కొన్నారు.వ్యక్తిగతంగా తనకు కోపం ఉన్న వారిపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.అయితే సుశాంత్ కుటుంబం దాఖలు చేసిన ఎఫ్ఐఆర్కి ఆమె ఆరోపణలతో ఉపయోగం లేదు అని పేర్కొన్నారు.కంగనా కొన్ని విషయాలు మాత్రం సరిగానే చెప్పారని లాయర్ పేర్కొన్నారు.
బాలీవుడ్లో బంధుప్రీతి ఉందన్నది జగమెరిగిన సత్యం.సుశాంత్ కూడా అలాంటి వివక్ష ఎదుర్కొని ఉండొచ్చు.
కానీ ఆయన మరణానికి అది మాత్రమే కారణం కాదు.కాని రియా, ఆమె గ్యాంగ్ కలిసి సుశాంత్ని ఎలా సర్వం దోచుకుని అతడిని చంపేశారన్నది ప్రాముఖ్యమైన విషయం.
అని లాయర్ వికాస్ పేర్కొన్నారు.