బాలీవుడ్ జంట కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత కొన్ని రోజులుగా ఈ జంట పేర్లు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాయి.
తాజాగా డిసెంబర్ 9న ఈ జంట వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.రాజస్థాన్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
వీరి పెళ్లి అతికొద్ది మంది బంధువులు సన్నిహితులు సెలబ్రిటీల సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే.ఒమిక్రాన్ వైరస్ కారణంగా అతికొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుకను నిర్వహించారు.
పెళ్లికి వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్ గా మిఠాయి బాక్స్ తో పాటు ఒక లెటర్ ను అందించిన విషయం తెలిసిందే.అయితే వీరి పెళ్లికి చాలామంది సెలబ్రిటీలను సినీ తారలను ఆహ్వానించలేదు.
దీనితో ఎవరెవరికి అయితే పెళ్లి ఆహ్వానం అందలేదో వారందరికీ ఈ జంట ప్రస్తుతం రిటర్న్ గిఫ్టులు పంపిస్తున్నారు.ఈ జంట పంపించే గిఫ్ట్ బాక్స్ లో నాలుగు రకాల పంజాబీ స్వీట్స్ తో పాటుగా.
థాంక్యూ లెటర్ కూడా ఉంది.ఈ జంట బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు గిఫ్ట్ పంపించారు.
ఇదే విషయాన్ని కంగనా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ నుంచి సువాసనతో కూడిన పువ్వులు.రుచికరమైన నేతి లడ్డూలు అందాయి.థాంక్యూ అండ్ హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అంటూ పోస్ట్ చేసింది.ఈ జంట పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.దీంతో పలువురు అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మొత్తానికి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట తాజాగా మూడుముళ్ల బంధంతో ఒక్కటైన వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.కంగనా రనౌత్ షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.