సినీ నటి కంగనా రనౌత్ గురించి తెలియని వారుండరు.సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తలలో నిలుస్తుంది నటి కంగనా రనౌత్.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ రాజ్ సింగ్ వ్యవహారంపై పెద్ద ఎత్తున మహారాష్ట్ర ప్రభుత్వంపై, అదే విధంగా బాలీవుడ్ లోని కీలక వ్యక్తులను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తూ దేశం మొత్తం సంచలనంగా మారింది.బాలీవుడ్ లో నెపోటిజంతో ఇతరులకు అవకాశాలు రావడం లేదని, వారికి నచ్చిన వారికే అవకాశాలు ఇస్తూ నచ్చని వారికి అవకాశాలు రానీయకుండా, ఇవ్వకుండా ఓ బడా మూవీ మాఫియా తయారైందని సంచలన వ్యాఖ్యలు చేయడంతో బాలీవుడ్ బిగ్ సెలెబ్రెటీస్ సినిమాల మీద కంగనా వ్యాఖ్యల ఎఫెక్ట్ పడింది.
అయితే కంగనా నుండి తాజాగా మరో అప్డేట్ వచ్చింది.కంగనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది.తన సొంత గ్రామమైన మనాలీలో ఒక కేఫ్, రెస్టారెంట్ ను ప్రారంభించనున్నట్లు తెలిపింది.అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే రీతిలో కంగనా కూడా వ్యాపారాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
అయితే మిగతా హీరోయిన్లు కూడా కంగనా బాటలో నడిచే అవకాశం ఉంది.వరుస సినిమాలలో నటిస్తూ త్వరలో కంగనా బిగ్ ఫిలిమ్ అప్డేట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది.