బాలీవుడ్ ప్రముఖులపై మరోసారి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది.తన జీవితంను నాశనం చేసేందుకు చాలా మంది ప్రయత్నించారు.
తనను ఇండస్ట్రీ నుండి పంపించేందుకు కొందరు కుట్ర పన్నారు.అయినా కూడా నేను నా శక్తితో కెరీర్లో ముందుకు వెళ్తున్నాను.
నేను చాలా జాగ్రత్తగా కెరీర్ను డిజైన్ చేసుకుని ఈ స్థాయికి వచ్చానంటూ కంగనా పేర్కొంది.తన కెరీర్ ఆరంభం నుండి కొందరు కిందకు లాగేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
తను వెడ్స్ మను 2 చిత్రం తర్వాత నా కెరీర్ గ్రాఫ్ పెరిగింది.ఆ సమయంలో నా చేతిలో చాలా బ్రాండ్స్ వచ్చి పడ్డాయి.దాంతో కొందరు ఆ విషయాన్ని జీర్ణించుకోలేక పోయాడు.ఆ సమయంలోనే హృతిక్ రోషన్ విషయాన్ని మీడియా ముందుకు తీసుకు వచ్చి నా పరువు తీసేలా మాట్లాడాడు.
ఆ తర్వాత నా వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసేలా ప్రయత్నించారు.
నా పై పడ్డ నిందతో నా బంధువులు నన్ను వెలి వేశారు.దాంతో నాకు పెళ్లి కాకుండా అడ్డుకున్నారు.నేను బాలీవుడ్లో ఉన్న ఇబ్బందుల గురించి మాట్లాడుతుంటే అంతగా ఇబ్బంది ఉంటే వెళ్లి పోవచ్చు కదా ఎందుకు ఉండటం అంటూ కరణ్ జోహార్ లండన్ లో ఒక కార్యక్రమంలో ప్రశ్నించాడు.
ఆయనతో పాటు నన్ను కొందరు నిర్మాతలు దారుణంగా చూశారు.ఒక సినిమా ను ఒప్పుకోలేదు అన్న కోపంతో మహేష్ భట్ నా పైకి షూ విసిరాడు.ఆ విషయం నన్ను కలచి వేసింది.అయినా కూడా నేను పట్టుదలతో ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను.