జాతీయ స్థాయిలో ఒక హీరోయిన్ కి ఏకంగా నాలుగు సార్లు జాతీయ అవార్డు రావడం అనేది ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చాలా అరుదుగా జరుగుతుంది.అయితే బాలీవుడ్ కథానాయికలు కొంత మంది రెండు సార్లు జాతీయ అవార్డులు అందుకున్న సందర్భాలు ఉన్నాయి.అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మాత్రం ఏకంగా నాలుగు సార్లు ఉత్తమ నటిగా నాలుగు సార్లు అవార్డులు అందుకుంది.67వ జాతీయ అవార్డులలో భాగంగా 2019కి గాను మణికర్ణిక, పంగా సినిమాలకి ఉత్తమనటిగా కంగనా రనౌత్ జాతీయ అవార్డుని అందుకుంది.బాలీవుడ్ లో క్వీన్ కంగనా అంటే చాలా మందికి టెన్సన్ మొదలైపోతుంది.ఉన్నది ఉన్నట్లుగా మొహంపైనే మాట్లాడే ఈ భామ బాలీవుడ్ లో స్టార్స్ గా చెలామణి అవుతున్న అందరిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంది.
ఎవరైనా తన వైపు వేలెత్తి చూపిస్తే వారి మీద వెంటనే మాటలతో దాడి చేస్తుంది.సుశాంత్ మరణం తర్వాత కంగనా బాలీవుడ్ లో నెపోటిజం మీద పెద్ద ఎత్తున విమర్శలు చేసింది.
ఇదిలా ఉంటే మొదటి నుంచి బీజేపీ పార్టీకి, నరేంద్ర మోడీకి విదేయురాలిగా కంగనా రనౌత్ ఉంటుంది.బీజేపీ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న వాటిని సమర్ధిస్తూ ఉంటుంది.
ఈ నేపధ్యంలోనే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆమెకి జాతీయ నటిగా అవార్డులు రావడం జరుగుతుందనేది కొంత మంది కంగనా వ్యతిరేకుల మాట.అయితే ఈ విషయంలో కంగనా రనౌత్ వాదన మరోలా ఉంటుంది.బాలీవుడ్ లో తనకంటే గొప్ప నటి ఎవరూ లేరని, ఈ జెనరేషన్ కి తానే బెస్ట్ నటిని అని చెప్పుకుంది.ఆమె చెప్పుకుంటున్నట్లుగానే అవార్డులు కూడా వస్తూ ఉండటం విశేషం.
అయితే కంగనాకి నాలుగో సారి జాతీయ అవార్డు రావడం బాలీవుడ్ లో చాలా మందికి మింగుడుపడని విషయం అని చెప్పాలి.
.