సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై చాలా మంది రియాక్ట్ అయ్యారు.బాలీవుడ్ అతనిని దూరం పెట్టడం వలన కలిగే మానసిక వెధనతోనే ఆతను ఆత్మహత్య చేసుకున్నాడు అని అందరూ భావిస్తున్నారు.
ఈ విషయంలో బాలీవుడ్ లో నెపోటిజం, బంధుప్రీతి గురించి పెద్ద చర్చ నడుస్తుంది.దీనిపై బాలీవుడ్ సెలబ్రెటీలు రెండుగా విడిపోయారు.
కొంతమంది బంధుప్రీతిని సమర్ధిస్తే, మరికొంత మంది ఈ వారసత్వ నటుల కారణంగా తాము అవకాశాలు కోల్పోయామని మీడియా ముందుకి వచ్చి చెబుతున్నారు.అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్ లో నేపోటిజంపై వ్యతిరేక వాయిస్ పేరడానికి కారణం అయ్యింది.
ఈ విషయంలో కాంగానా పదే పదే ఈ ఇష్యూని గుర్తు చేస్తూ తన వేధింపులకి కక్ష తీర్చుకుంటున్నట్లు వ్యవహరిస్తోంది.సుశాంత్ మరణాన్ని అందరికంటే ఎక్కువగా కంగనా ఫోకస్ చేసి బాలీవుడ్ లో తనకి వ్యతిరేకంగా ఉన్నవారిపై బాణంలా వాడుకుంటుంది.
ఈ విషయంపై కొందరు నటులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.సుశాంత్ మరణాన్ని కొందరు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని కాంగానాని ఉద్దేశించి కొంత మంది సెలబ్రెటీ ప్రముఖులు ట్వీట్ లు చేశారు.
అయితే సుశాంత్ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రావడంతో వాటిని తొలగించారు.తాజాగా సుశాంత్ విషయంలో బాలీవుడ్ పెద్దలు ఎంత దారుణంగా వ్యవహరించారో చెప్పడానికి సంజయ్ లీలా బన్సాలీ, ఆదిత్యా చోప్రా పోలీసులకి ఇచ్చిన వాంగ్మూలం గుర్తు చేసింది.
నా విషయంలో కూడా బాలీవుడ్ పెద్దలు ఇలాగే వ్యవహరిస్తునన్నారు అంటూ, తన కెరియర్ ని నాశనం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారని చెప్పుకొచ్చింది.అయితే ఈ విషయంలో ఎవరు తనని తప్పు పడుతున్న వారి మీద కూడా కాంగాన తప్పుడు వాఖ్యలు చేస్తూ హడావిడి చేస్తుంది.
కంగనా వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద తలనొప్పిగా మారిందని బీటౌన్ లో చెప్పుకుంటున్నారు.