హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ఫలితాల సరళి చూస్తూ ఉంటే టీఆర్ఎస్ గెలుపు వైపు పరుగులు పెడుతుంది.మరో వైపు ఎన్నడూ లేని విధంగా ఈ సారి గ్రేటర్ ఎన్నికలలో కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ కూడా అనూహ్యంగా పుంజుకొని తెలంగాణలో టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా తామే అని రుజువు చేసుకుంది.2022 అసెంబీ ఎన్నికలలో టీఆర్ఎస్ కి పోటీ ఇచ్చే పార్టీకి రేసులోకి వచ్చింది.ఇదిలా ఈ గ్రేటర్ పోరులో ఊహించని విధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయ్యేలా కనిపిస్తుంది.
గత ఎన్నికలలో దారుణంగా దెబ్బ తిన్న కాంగ్రెస్ గ్రాఫ్ అనూహ్యంగా తగ్గుతూ వస్తుంది.నాయకత్వ లోపం, అలాగే తెలంగాణ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వలన ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది.
దుబ్బాక ఎన్నికల తర్వాత గ్రేటర్ పోరులో కేవలం ఇప్పటి వరకు రెండు స్థానాలకి పరిమితం అయ్యింది.ఈ ఫలితాల ద్వారా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గ్రేటర్ లో ఏ స్థాయికి దిగజారిపోయిందో చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ పరిస్థితిపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కౌంటర్ వేసింది.ప్రియమైన కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి.
రోజంతా కంగనా కంగనా అంటూ నా నామ జపం చేస్తున్నాయి.ఇలాగైతే మీకు ఏ లాభం ఉండదు.
క్లిష్టమైన నగరాల్లో బీజేపీ ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది.కొత్తగా పలు ప్రాంతాల్లో విజయం సాధిస్తోంది అని కంగన రనౌత్ పేర్కొంది.
మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగమైన కాంగ్రెస్ పార్టీ తన మీద ప్రతీకార చర్యలకి పాల్పడుతూ ఉండటంతో కంగనా ఈ విధంగా పార్టీపై విమర్శలు చేసిందని తెలుస్తుంది.