బాలీవుడ్ నటి ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కంగానా ఏ విషయాని అయిన నిస్సంకోచంగా ఆ ముఖం మీదే మాట్లాడేస్తూ ఉంటుంది.
అందుకే ఆమెను అభిమానులు ఫైర్ బ్రాండ్ అని పిలుస్తూ ఉంటారు.కంగనా నిత్యం ఏదో ఒక వివాదంతో తరచుగా సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది.
కొన్ని కొన్ని సార్లు అయితే తనకు సంబంధం లేని విషయాలలో కూడా ఆమె కలుగజేసుకుని మరి విషయాలపై స్పందించి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ కి కూడా గురి అవుతూ ఉంటుంది.
అలాగే సమాజంలో జరిగే పలు విషయాల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీ క్వీన్ గా కూడా పేరు తెచ్చుకుంది కంగానా.
ఇకపోతే కంగనారనౌత్ ప్రస్తుతం ధాకడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.అయితే విడుదలయ్యే మరికొన్ని రోజులే సమయం ఉండటంతో ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉంది కంగనారనౌత్.
సినిమాను సంబంధించి పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ అనేక విషయాలను పంచుకుంటోంది.అయితే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది కంగనా రనౌత్.
ఇదిలా ఉంటే తాజాగా ఆమె మరొక సారి బాలీవుడ్ హీరోలను టార్గెట్ చేసింది.తనకు ఏ ఒక్క స్టార్ హీరో కూడా ప్రమోషన్స్ లో హెల్ప్ అవ్వడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేసింది.అంతే కాకుండా బాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోలు తన సినిమాలను ప్రమోట్ చేయడానికి భయపడతారు అని తెలిపింది.అయితే ఆ హీరోల కంటే తనకు ఎక్కువగా క్రేజ్ గుర్తింపు వస్తుంది ఏమో అన్న భయంతో చాలామంది తమ సినిమాలను చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటూ సంచలన ఆరోపణలు చేసింది కంగానా రనౌత్.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కంగనారనౌత్ చేసిన వాఖ్యలు ప్రస్తుతం మొదలవుతున్నాయి.కేవలం ఇప్పుడే కాకుండా కంగానా ఎప్పటికప్పుడు బాలీవుడ్ స్టార్స్ పై అలాగే స్టార్ హీరోయిన్ లపై విమర్శలు చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.