బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా కంగనా ప్రధాన పాత్రలో తలైవి సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమా జయలలిత బయోపిక్ గా రూపొందుతుంది.
ఈ సినిమాలో కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తుంది.ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్యే విడుదలయ్యి తమిళనాడులో తీవ్ర చర్చకు దారి తీసింది.
రిలీజైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.కంగనా పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ తలైవి ను విడుదల చేసారు.
ఈ ట్రైలర్ చుసిన ప్రేక్షకులకు ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగి పోయాయి.
ఈ సినిమాలో కంగనా ను చుస్తే జయలలితను చూసి నట్టుగానే ఉందని పలువురు కామెంట్స్ పెడుతున్నారు.
కంగనా అంతలా ఈ పాత్ర లో జీవించింది.అభిమానులే కాదు ప్రముఖులు కూడా ఈ ట్రైలర్ చూసి కంగనాకు పొగడ్తలతో ముంచెత్తారు.
ఈ సినిమాను ఏ.ఎల్ విజయ్ డైరెక్ట్ చేసారు.
తలైవి సినిమా ఏప్రిల్ 23 న పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది.
ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వచ్చినప్పటికి మేకర్స్ మాత్రం అదే రోజున విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.ఈ నేపథ్యంలో కంగనా బాలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వారు వేధించి నన్ను చుట్టుముట్టారు.
ఈ ఇండస్ట్రీ నుండి పంపాలని చాలా పనులు చేసారు.కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ప్రముఖులందరూ దాక్కున్నారు.
కానీ నేను నా బృందంతో బాలీవుడ్ ను కాపాడడానికి 100 కోట్ల సినిమాతో వస్తున్నా.అంటూ కంగనా తెలిపింది.
ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.