బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాస్పద నటిగా పెద్ద ఎత్తున పాపులర్ అయిన విషయం తెలిసిందే.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో సుశాంత్ ఆత్మహత్య కు బాలీవుడ్ బడాబాబులు కారణమని ఆరోపిస్తూ సంచలన వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున సంచలనం రేపిన విషయం తెలిసిందే.
ఆ తరువాత మహారాష్ట్ర ప్రభుత్వంతో వివాదంతో మరోసారి కంగనా రచ్చాకెక్కింది.బాలీవుడ్ లో తాము అనుకున్న వారికే అవకాశాలు ఇస్తారని, సినీ నేపథ్యం లేని వారికి అవకాశాలు రావడం అనేది చాలా కష్టమని, బాలీవుడ్ లో ఒక మాఫియాలా తయారయిందని కరణ్ జోహార్, మహేష్ భట్ లాంటి బాలీవుడ్ అగ్ర నిర్మాతలపై కామెంట్స్ చేసి దుమారం రేపింది.
అయితే ఇతర నటుల విషయంలో ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే నైజం కలిగి ఉండే కంగనా ఒక్కసారిగా తన రూట్ ను మార్చి ఒక్కసారిగా రివర్స్ గేర్ వేసి బీటౌన్ లో కాక రేపిందని చెప్పవచ్చు.తాజాగా విద్యాబాలన్ పై కంగనా ప్రశంసల జల్లు కురిపించింది.
విద్యాబాలన్ నటించిన సిల్క్ స్మిత జీవితం ఆధారంగా వచ్చిన డర్టీ పిక్చర్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే.అయితే ఈ సినిమలో విద్యబాలన్ పాత్రకు మొదట కంగనాను అనుకున్నా కంగనా అంగీకరించకపోవడంతో విద్యాబాలన్ నటించింది.
తాజాగా ఈ సినిమా విశేషాలపై స్పందిస్తూ విద్యాబాలన్ ఈ సినిమాలో అద్భుతంగా నటించిందని, నేను నటించి ఉంటే పాత్రకు సరిగ్గా న్యాయం చేయలేకపోయేదానినని కంగనా తెలిపింది.