బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా, వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న భామ కంగనా రనౌత్.ఎలాంటి స్టార్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో టీనేజ్ వయసులో అడుగుపెట్టి సినిమా స్టూడియోల బయట ఖాళీ కడుపుతో పడుకొని చిన్న చిన్న అవకాశాలతో నటిగా చేస్తూ వచ్చిన డబ్బులతో నెట్టుకొస్తూ మెల్లాగా బాలీవుడ్ లో వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని స్టార్ నటిగా ఎదిగింది.
ఓ విధంగా చెప్పాలంటే కంగనా జీవితం హీరోయిన్ గా కెరియర్ ఎంచుకొని ప్రతి అమ్మాయికి స్ఫూర్తి అని చెప్పాలి.ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా ప్రస్తుతం కంగనా కొనసాగుతుంది.
అయితే ఈ భామ తరుచు బాలీవుడ్ లో వారసత్వ హీరోలు, హీరోయిన్స్ మీద విమర్శలు చేయడంతో వివాదాస్పద నటిగా మారిపోయింది.ఇదిలా ఉంటే ఆమె జీవిత అనుభవాలని చాలా సందర్భాలలో మీడియాతో పంచుకుంది.
కెరియర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తున్న సమయంలో అందరూ అలాంటి అవకాశాలే ఇచ్చేవారు.ఒక వేళ పెద్ద సినిమా అవకాశం వచ్చిన రొమాంటిక్ పాత్రలకి పరిమితం చేసేవారు.
అలాంటి సమయంలో తన అక్క రంగోలిపై యాసిడ్ యటాక్ జరిగింది.ఆమె ట్రీట్మెంట్ కోసం వచ్చిన ప్రతి పాత్రని చేసేదానిని, ఈ సమయంలో ఎన్నో చెత్త సినిమాలు కూడా చేసాను.
అదే సమయంలో నా చేతకాని తనం ఉపయోగించుకొని లైంగికంగా కూడా వాడుకున్నారు.వేధింపులకి గురి చేశారు.
ఈ సంఘటనలు అన్ని నన్ను మానసికంగా మరింత స్ట్రాంగ్ గా చేసాయి.నిజంగా ఇలాంటి జీవితాన్ని అనుభవించడం ఓ విధంగా ఎంత నరకంగా ఉంటుందో చెప్పడం చాలా కష్టం.
అయిన కూడా తన కుటుంబం కోసం, ఇండస్ట్రీలో ఎదగడం కోసం అన్ని భరించా అని చెప్పుకొచ్చింది.ఈ విషయాన్ని చెబుతున్న సమయంలో కంగనా తాను కన్నీరు పెట్టుకొని అందరిని కన్నీరు పెట్టించింది.