బాలీవుడ్
స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి
కంగనా రనౌత్
.బాలీవుడ్ లో హీరోలతో సమానంగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ అదే స్థాయిలో కలెక్షన్స్ కూడా రాబడుతున్న కంగనా ప్రస్తుతం జయలలిత బయోపిక్ లో నటిస్తుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సినిమా షూటింగ్ లు లేకపోవడంతో ఇంట్లో ఖాళీగా ఉంటున్న ఈ భామ
సోషల్ మీడియా
ద్వారా ఫ్యాన్స్ కి తనకి తోచిన సలహాలు ఇస్తుంది.తన జీవిత అనుభవాలు చెబుతూ ఆధ్యాత్మిక బోధనలు బోధిస్తుంది.నేను ఇల్లు విడిచి పెట్టిన రెండు సంవత్సరాలకే సినిమా స్టార్నయ్యాను.కానీ
డ్రగ్స్
కు బానిసగా మారిపోయాను.అప్పుడు నా జీవితం గందరళంగా మారిపోయింది.
చావు నుంచి సైతం నన్ను రక్షించగలిగే కొద్ది మంది వ్యక్తులు నా వెంట ఉన్నారు.
ఇదంతా నా యుక్త వయసులో జరిగింది.సరిగ్గా ఇదే సమయంలో ఒక ఫ్రెండ్ నా జీవితంలోకి ప్రవేశించింది.
యోగాను పరిచయం చేసింది.రాజయోగ పుస్తకాన్ని అందించింది.
ఆధ్యాత్మికత వైపు నడిపించింది.ఆ తర్వాత
స్వామి వివేకానంద
ను నా గురువుగా ఎంచుకున్నాను.
అప్పటి నుంచి వ్యక్తిగతంగా ఎంతో ఎదిగాను.కానీ ఇలాంటి చాలెంజ్లు ఎదురవకపోతే నా గుర్తింపును కోల్పోయేదాన్ని.
ఆధ్యాత్మిక మార్గం లేకుండా నా తెలివి తేటలను, మానసిక ఆరోగ్యాన్ని, స్వశక్తిని పెంపొందించుకోలేకపోయేదాన్ని అని తెలిపింది.పనిలో పనిగా
లాక్ డౌన్
సందర్భంగా దొరికిన ఖాళీ సమయాన్ని తమ జీవితాన్ని మార్చుకోవడం కోసం ఉపయోగించుకోవాలని కంగనా పిలుపునిచ్చింది.