బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ముక్కుసూటి అమ్మాయిగా అభిమానుల మనసులో నిలిచింది.తాను నటన పట్ల ఎంతో ఆసక్తి చూపించడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే ఆసక్తి చూపుతుంది.
తన నటనకు ఉత్తమనటి అవార్డులను కూడా సొంతం చేసుకుంది కంగనా.ఎప్పుడు సోషల్ మీడియాలో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ల తో బిజీగా ఉంటూ ఇప్పుడు ట్విట్టర్ కే కౌంటర్ ఇచ్చింది.
ప్రస్తుతం ట్విట్టర్ ఖాతా పై తీవ్రమైన విమర్శలు ఎదురవుతున్నాయి.చాలా మంది వినియోగదారులు పోస్టులను, ఖాతాలను డిలీట్ చేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినియోగించే ఖాతా ట్విట్టర్ కాగా ప్రస్తుతం ఈ యాప్ ను తక్కువగా వాడుతున్నారు.కానీ ప్రపంచవ్యాప్తంగా ముందున్న ఈ యాప్ ను మించి మరో కొత్త యాప్ లు వస్తున్నాయి.
ట్విట్టర్ ను మించి వచ్చిన దేశీయ యాప్ కూ .
ప్రస్తుతం ఈ యాప్ ను చాలా మంది ప్రముఖులు వినియోగిస్తున్నారు.పలురకాల ఫీచర్ లతో ముందుకొచ్చిన ఈ యాప్ ను ఇప్పటికే కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, పీయుశ్ గోయల్ వంటి వారు వాడుతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూ యాప్ లో చేరింది.
ఈ కొత్త యాప్ లో చేరిన కంగనా ట్విట్టర్ కు కౌంటర్ ఇస్తూ ట్విట్టర్ నీ టైం అయిపోయింది.కూ యాప్ కు హాయ్ చెప్పే సమయం వచ్చేసింది.
దేశీయంగా అభివృద్ధి చెందుతున్న ఈ యాప్ లో అడుగు పెట్టినందుకు థ్రిల్లింగ్ గా ఉంది.త్వరలోనే ఈ యాప్ గురించి వివరాలు తెలుపుతాను అని ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.
అంతేకాకుండా వాట్సప్ కు పోటీగా సందేశ్ అనే సరికొత్త యాప్ ప్రస్తుతం ముందుంది.