బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలకి దీటుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటి కంగనా రనౌత్.ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత కథతో ప్రేక్షకుల ముందుకి వచ్చి రికార్డ్ విజయాన్ని అందుకుంది.
ఇక వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉన్న కంగనా ప్రస్తుతం పంగా అనే సినిమాలో నటిస్తుంది.ఇందులో ఈ భామ మాజీ మహిళా కబడ్డీ చాంపియన్ జయ పాత్రను పోషిస్తుంది.
తాజాగా ఆమె ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది.తన పెళ్లి గురించి మనసులో మాటను బయటపెట్టింది.
మొన్నటి వరకు తనకి పెళ్లంటేనే అంత ఒపీనియన్ లేదని, అయితే ఇప్పుడు నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.దీనికి పంగా దర్శకురాలు అశ్విని అయ్యర్, ఆమె భర్త నితేశ్ తివారి కారణం.
వీళ్లిద్దరి మధ్య ప్రేమను చూసిన తర్వాత పెళ్లిపై కోరిక పుట్నాటిందని చెప్కుపింది.నితేశ్ తివారి, తన భార్యకు ఎంతో సపోర్ట్ చేస్తాడు.
వాళ్లను చూశాక నాకూ పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది.అయితే తనకి కాబోయే భర్త అందం, తెలివితేటలు అన్నింటిలోనూ తనకన్నా ఓ మెట్టు ఎక్కువే ఉండాలంది.
అలాంటి వాడితోనే మూడు ముళ్లు వేయించుకుంటానని చెప్పుకొచ్చింది.దీంతో కంగనా ఈ ఏడాది పెళ్లిపీటలెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆమె అభిమానులు చెప్పుకుంటున్నారు.
అయితే కంగనా ఇప్పటికే ఒకసారి ఓ స్టార్ హీరోతో లవ్ స్టొరీ నడిపి ఫెయిల్ అయ్యింది.మరి ఇలాంటి టైంలో కంగనా తనకి సరిపోయే వరుడుని ఎలా వెతుక్కుంటుంది అనేది చూడాలి.