బాలీవుడ్ నటీమణుల్లో ఎప్పుడు ఏదో ఒక వార్తలో నిలిచే హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ముందుగా వినిపించే పేరు కంగనా రనౌత్.ఆమె చేసే సినిమాలు ఎంత విజయాలను అందుకుంటాయో అంతకంటే ఎక్కువ వివాదాల్లో ఆమె నిలుస్తుంది.
సినిమాలు సెలెక్ట్ చేయడంలో ఆమెకున్న మెచ్యురిటీ మరే ఇతర బాలీవుడ్ బ్యూటీకి లేదంటే అతిశకయోక్తి కాదు.
అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, కంగనా రనౌత్ల మధ్య నడిచిన వివాదం మరవక ముందే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది ఈ బ్యూటీ.
ఒంటిపై నూలుపోగు లేకుండా నటించేందుకు తానెప్పటినుండో రెడీ అంటోంది ఈ బ్యూటీ.ఇటీవల శృంగారంపై తన వ్యాఖ్యలు ఎంతదుమారం రేపాయో అందరికీ తెలిసిందే.
కాగా ఇప్పుడు ఒంటిపై నూలుపోగు లేకుండా నటించేందుకు కంగనా సిద్ధం అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
ఇక అసలు విషయం ఏమిటంటే.తమిళంలో అందాల భామ అమలా పాల్ నటించిన ఆడై సినిమాలో ఆమె పూర్తిగా నగ్నంగా నటించిన విషయం తెలిసిందే.తెలుగులోనూ ఈ సినిమాను ‘ఆమె’ పేరుతో రిలీజ్ చేశారు.
ఈ సినిమా కథను బాలీవుడ్లో తెరకెక్కించేందుకు దర్శకుడు రత్నకుమార్ రెడీ అయ్యాడు.ఇప్పటికే ఈ సినిమా హిందీ హక్కులు పొందిన దర్శకనిర్మాత విక్రమ్ భట్ ఈ కథను కంగనాకు వినిపించాడట.
కథ బాగా నచ్చడంతో నగ్నంగా నటించేందుకు ఆమె వెంటనే ఓకే చెప్పేసినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.మరి ఈ మూవీ సెట్స్పైకి ఎప్పుడు వెళ్తుందో అని కంగనా రనౌత్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.