బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత ఆ ఇష్యూని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సంచలన విషయాలని తెరపైకి తీసుకొని వచ్చారు.కేవలం ఇండస్ట్రీలో నెపోటిజం కారణంగానే సుశాంత్ చనిపోయాడని తీవ్ర వాఖ్యలు చేసింది.
అప్పటి నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో తాను వ్యతిరేకించే అందరిని కూడా టార్గెట్ చేయడం మొదలు పెట్టింది.సుశాంత్ ఇష్యూతో సంబంధం లేని వారిని కూడా కంగనా ఆ ఇష్యూలోకి లాగింది.
అయితే సుశాంత్ కేసు వ్యవహారం పూర్తిగా టర్న్ తీసుకొని దానిలోకి రియా చక్రవర్తి వచ్చి చేరింది.అయినా కూడా కంగనా బాలీవుడ్ ప్రముఖుల్ని టార్గెట్ చేస్తూనే ఉంది.
దీంతో ముందుగా ఆమెకి మద్దతుగా నిలిచిన సినిమా ప్రేమికులు ఇప్పడు కంగనాకి వ్యతిరేకంగా మారుతున్నారు.దీంతో ఆమెని సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతూ ఉంది.
ఇప్పటికే కంగనాపైన సినీ ప్రముఖులు పలువురు ఎదురుదాడి చేయడం మొదలు పెట్టారు.కంగనా కావాలని తనకి వ్యతిరేకంగా ఉన్న అందరి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ విధంగా వ్యవహరిస్తోంది అని విమర్శించారు.
అయితే ఇలాంటి విమర్శలు నెటిజన్లు నుంచి కూడా వస్తున్నాయి.
పబ్లిసిటీ కోసమే ఆమె పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటుందని ఆమెపై విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆమె ప్రవర్తన నచ్చక సోషల్ మీడియాలో కంగనాని అన్ఫాలో చేస్తున్నవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది.దీంతో ఓ నెటిజన్ ఆమెకు ట్వీట్ చేశాడు.ప్రతి రోజు దాదాపు 50 వేల మంది ఫాలోవర్లను కోల్పోతున్నారని ఆమెకు గుర్తు చేశాడు.దీనిపై కంగనా రనౌత్ స్పందిస్తూ ఈ విషయాన్ని తాను గమనించానని చెప్పింది.
ట్విట్టర్ తనకు కొత్త అని, నెటిజన్లు ఎందుకు అన్ఫాలో అవుతున్నారో తెలియట్లేదని తెలిపింది.తనలాంటి జాతీయవాదులు ప్రతి చోట కష్టపడాల్సి వస్తుందని, రాకెట్ చాలా బలంగా ఉందని కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది.
తనను అన్ఫాలో చేసిన వారికి హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నానంటూ పేర్కొంది.మొత్తానికి తనని నెటిజన్లు ఆన్ ఫాలో కావడానికి కూడా బాలీవుడ్ మాఫియానే కారణం అనే విధంగా కంగనా కామెంట్లు ఉండటం విశేషం
.