బాలీవుడ్ లో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంటుంది.ముఖ్యంగా సుశాంత్ చనిపోయిన తర్వాత నెపోటిజంపై కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో అందరిపైన వాఖ్యలు చేస్తూ వస్తుంది.
తన వాఖ్యలని ఎవరు వ్యతిరేకించిన వారిని కూడా టార్గెట్ చేస్తుంది.ఓ విధంగా చెప్పాలంటే కంగనా ఇప్పుడు తన వ్యక్తిగత ఎజెండాతో బాలీవుడ్ ప్రముఖులపై మాటల దాడి చేస్తుంది.
కావాలనే ఆమె బాలీవుడ్ చిత్ర పరిశ్రమని రెండు వర్గాలుగా విడగొట్టే ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.అయితే ఈ మాటలు ఎవరైనా అంతే వారిని కూడా ఈ టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంది.
తాజాగా మరోసారి కంగనా బాలీవుడ్ స్టార్స్ పైన నోరు పారేసుకుంది.
తాజాగా రణబీర్ కపూర్, దీపికా పదుకుణేలను ఆమె టార్గెట్ చేసింది.
రణబీర్ కపూర్ స్త్రీలోలుడని వ్యాఖ్యానించింది.దీపిక ఒక మానసిక వ్యాధిగ్రస్తురాలని కామెంట్ చేసింది.
ప్రతిరోజు అమ్మాయిల వెంట పడే రణబీర్ ను ఎవరూ రేపిస్ట్ అని పిలవరని కంగన చెప్పింది.తనను తాను మానసిక వ్యాధిగ్రస్తురాలిగా దీపిక ప్రకటించుకుందని, అయినప్పటికీ ఆమెను ఎవరూ సైకో, రాక్షసి అని పిలవరని విమర్శించింది.
సాధారణ కుటుంబాల నుంచి, చిన్న పట్టణాల నుంచి వచ్చే వారికి మాత్రం ఇలాంటి పేర్లు పెడతారని మండిపడింది.రణబీర్, దీపికపై ఆమె చేసిన వాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనంగా మారాయి.
అసలు ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్ళని దీపికా పదుకునేని కూడా తన మాటలతో కంగనా వివాదంలోకి లాగింది.మరి ఆమె వాఖ్యలపై దీపికా ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.