బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత కేసు విచారణలో సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని తేలింది.కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు, నార్కోటిక్ అధికారులు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియాను విచారించగా ఈ కేసులో కొత్త పేర్లు వెలుగులోకి వచ్చాయి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ మరి కొంతమంది సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నారని ఆమె చెప్పినట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే తాజాగా డ్రగ్స్ కేసులో సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్ డ్రగ్స్ తీసుకున్నట్టు స్వయంగా ఆమె చెప్పిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డ్రగ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా డ్రగ్స్ తీసుకుందని తెలిసి కొందరు నెటిజన్లు మీరు కూడా డ్రగ్స్ తీసుకున్నారా…? అని వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.డ్రగ్స్ కేసు వెలుగులోకి రావడంలో బాలీవుడ్ లో పాటు ఇతర ఇండస్ట్రీల ప్రముఖులు కూడా ఉలిక్కిపడుతున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి సమయంలో కంగనా వీడియో కొత్త చర్చకు దారి తీస్తోంది.కంగనా ఈ వీడియోలో తాను ముంబైకి నటి కావాలనే ఉద్దేశంతో పారిపోయి వచ్చానని… ముంబైకి వచ్చిన చాలా సంవత్సరాల తరువాత హీరోయిన్ స్థాయికి ఎదిగానని… ఆ సమయంలో తాను డ్రగ్స్ తీసుకున్నానని… ఎంతోమంది చెడ్డవాళ్ల వల్ల ఇబ్బందులు పడ్డానని… తాను యుక్త వయస్సులో ఉన్న సమయంలో ఇదంతా చోటు చేసుకుందని అన్నారు. మనాలీలోని తన ఇంటి వద్ద నుంచి కంగనా ఈ వీడియోను పోస్ట్ చేశారు.కొన్ని రోజుల క్రితం కంగన సోషల్ మీడియాలో బాలీవుడ్ లో 99 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారని… తనకు మాత్రం డ్రగ్స్ తో ఎటువంటి సంబంధాలు లేవని ఆమె పేర్కొన్నారు.
తనకు డ్రగ్స్ తీసుకునేవాళ్లతో ఎటువంటి సంబంధాలు లేవని… సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే ముంబై వదిలి వెళ్లిపోతానని ఆమె అన్నారు.ఇలాంటి సమయంలో నెట్టింట వైరల్ అవుతున్న వీడియో కంగనా పరువు తీస్తోందనే చెప్పాలి.