బాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కంగనా ముక్కుసూటి మనిషిగా అభిమానుల మనసులో నిలిచింది.
ఇక తాను సోషల్ మీడియాలో ఎంత బిజీ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక ఆమె నటనకు ఉత్తమ నటి అవార్డులను కూడా సొంతం చేసుకుంది.
ఇక తన ట్విట్టర్ ఖాతాలో కౌంటర్లు ఇస్తూ వివాదాలలో చిక్కుతుంది.ఇదిలా ఉంటే కంగనా కన్నీళ్లు పెట్టుకొని అందరినీ షాక్ అయ్యేలా చేసింది.
తాజాగా ఆమె 34వ జన్మదిన సందర్భంగా ఆమె నటించిన తలైవి సినిమా టైలర్ విడుదల చేశారు.తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర తో తెరకెక్కనున్న ఈ సినిమాలో కంగనా జయలలిత పాత్రలో నటించింది.
ఇక ఈ సినిమాను డైరెక్టర్ విజయ్ దర్శకత్వం వహించారు.ఇక తాజాగా ట్రైలర్ విడుదల వేడుకలో పాల్గొన్న కంగనా మాట్లాడుతూ భావోద్వేగానికి గురైతు కన్నీళ్లు పెట్టుకుంది.
ఈ సినిమా తనకెంత ప్రత్యేకమని ఈ సందర్భంగా ఆమె ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంది.ఆయన తన ప్రతిభ పై తనకు నమ్మకం కలిగేలా చేశారట.సాధారణంగా సినిమా సెట్ లో ఒక హీరోతో ఉన్నంత చనువుగా ఒక హీరోయిన్ తో ఎవరు ఉండరని, కానీ నటీనటులతో ఎలా వ్యవహరించాలనే విషయాన్ని ఆయనను చూసి నేర్చుకున్నానంటూ డైరెక్టర్ విజయ్ ఉద్దేశిస్తూ ఆమె కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది.అంతేకాకుండా ఆమె భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకోగానేను ఎప్పుడు ఏడవనునన్ను ఏడిపించి హక్కు ఎవరికీ ఇవ్వను.
నేను చివరిగా ఏడ్చింది ఎప్పుడో కూడా గుర్తులేదు.కానీ ఈరోజు నేను ఏడ్చాను.
ఇప్పుడు మనసు తేలికగా ఉంది’ అని తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ లో తెలిపింది.ఇక ఈ సినిమా ఏప్రిల్ 23 న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.