మీలాగా మేము దేశాన్ని అమ్మట్లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా!

గత కొద్ది నెలల నుంచి ఇండియాలో రైతులు ఆందోళన చేపట్టారు.అయితే వీరు చేస్తున్న డిమాండ్లకు ప్రభుత్వం స్పందించకపోవడంతో వీరి ఆందోళనలను విరమించకుండా అలాగే కొనసాగిస్తున్నారు.

 Kangana Ranaut Reacted To Pop Singer Rihanna Tweet, Kangana Ranaut , Pop Singer-TeluguStop.com

అదేవిధంగా ఇక్కడ రైతులు చేస్తున్నటువంటి ఆందోళనకు అందరి మద్దతు కావాలని కూడా తెలియజేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఇండియా లో జరుగుతున్న రైతుల ఆందోళన గురించి అమెరికా ప్రముఖ సింగర్ రిహానా స్పందించారు.

ఈ క్రమంలోనే రైతుల ఆందోళన పై స్పందించిన సింగర్ రిహానా ఓ వార్తను పోస్ట్ చేస్తూ.మనం ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుకోవడం లేదు అంటూ ట్వీట్ చేశారు.

అయితే సింగర్ రిహానా చేసిన ట్వీట్ కి ప్రముఖ బాలీవుడ్ యాక్టర్, కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్ గా ఉండే కంగనా తనదైన శైలిలో స్పందించి రిహానాకు గట్టిగా సమాధానం తెలియజేశారు.రిహానా చేసిన ట్వీట్ కి ఘాటుగా స్పందిస్తూ… రైతుల ఆందోళన గురించి ఎవరూ మాట్లాడటం లేదు.

ఎందుకంటే వాళ్లు రైతులు కాదు ఉగ్రవాదులు.వాళ్లు ఇండియాను విభజించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఆ విధంగా ముక్కలైనా దేశాన్ని చైనా ఆక్రమించింది.మీ దేశం అమెరికాలో లాగా ఇక్కడ కూడా చైనీస్ కాలనీలను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.ఇక్కడ మేము మీ లాగా దేశాన్ని అమ్మటం లేదు అంటూ…రిహానా ట్వీట్ కి కంగనా ఈ విధంగా తనదైన శైలిలో గట్టిగా సమాధానం తెలియజేశారు.ప్రస్తుతం కంగనా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు వారు నిజంగానే వాళ్ళు ఉగ్రవాదులా… రైతులు కాదా? అన్న ఆలోచనలో పడ్డారు.ఏదిఏమైనా దేశంపై కంగనా కున్న గౌరవాన్ని ఈ విధంగా ట్వీట్ ద్వారా తెలియజేశారని అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube