కంగనా రనౌత్.ఇప్పుడు ఈ పేరు బాలీవుడ్ లో ఒక సెన్సేషన్ అని చెప్పాలి.
సినిమా, సినిమాకి తన ఇమేజ్ ని పెంచుకుంటూ స్టార్ హీరోలకి సైతం పోటీ ఇస్తున్న ఈ భామ సెలబ్రిటీలు అందరిని తన మాటలతో భయపెడుతూ ఉంటుంది.ఈ నేపధ్యంలో బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ని కంగనా రనౌత్ సొంతం చేసుకుంది.
మొదటి నుంచి బాలీవుడ్ లో నెపోటిజాన్ని వ్యతిరేకిస్తూ తన ఉనికిని చాటుకుంటున్న ఈ అమ్మడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత తన వాయిస్ మరింత పెంచింది.ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసింది.
అదే సమయంలో మహారాష్ట్ర సర్కారుతో ఏకంగా కయ్యం పెట్టుకుంది.ఎవరి అండ లేకపోయిన ఒంటరిగా ఒక రాష్ట్ర ప్రభుత్వంతోనే ఫైట్ చేసింది.
ఎప్పటికి తగ్గి, ఒదిగి ఉండే మనస్త్వత్వం తనది కాదని ఈ అమ్మడు మాటల బట్టి తెలుస్తుంది.అయితే ఈ మధ్యకాలంలో నటనలో కంగనా తనకి తానే మార్కులు ఇచ్చేసుకుంటుంది.
బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో తానే బెస్ట్ అని ఆ మధ్య కామెంట్ చేసింది.
నటనలో నన్ను అందుకునే దమ్ము ఎవరికీ లేదని కూడా వాఖ్యలు చేసి చాలెంజ్ విసిరింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీదేవి వర్ధంతి సందర్భంగా మరోసారి కీలక వాఖ్యలు చేసింది.శ్రీదేవి తర్వాత ఆమె స్థాయిలో కామెడీ పాత్రల్లో కూడా నటించగల సామర్థ్యం తనకు మాత్రమే సొంతమన కంగనా తెలిపింది.
ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందిన తను వెడ్స్ మను ఈ ఏడాదితో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అప్పటి వరకు ఒకే రకమైన పాత్రలను పోషించిన తన కెరీర్ ను ఈ చిత్రం మార్చి వేసిందని చెప్పింది.ఈ చిత్రంలో ఒక విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నానని తెలిపింది.
శ్రీదేవి తర్వాత ఆ స్థాయిలో కామెడీని పోషించింది తానేనని చెప్పింది.