టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అలాగే ప్రభాస్ బాహుబలి, సాహో చిత్రాలతో టాలీవుడ్ సినిమా పరిశ్రమని దాదాపుగా ప్రపంచానికి పరిచయం చేశాడు.
అంతేకాకుండా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.దీంతో హీరో ప్రభాస్ కి సామాన్య ప్రజల నుండి సినీ సెలబ్రిటీల వరకు దేశం నలుమూలలా అభిమానులు ఉన్నారు.
కాగా తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ “కంగనా రనౌత్” టాలీవుడ్ సినిమా పరిశ్రమపై మనసు పారేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.దీంతో మీడియా ఈ సమావేశంలో మాట్లాడుతూ తొందర్లో టాలీనే వుడ్ సినిమా దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందని, అలాగే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ చిత్రాలను బాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, శాండల్వుడ్, తదితర చిత్ర పరిశ్రమలలో కూడా రీమేక్ చేస్తూ బాగానే హిట్లు అందుకుంటున్నారని చెప్పుకొచ్చింది.
అలాగే తాను టాలీవుడ్ ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో తరచుగా టచ్ లో ఉంటానని దాంతో అప్పుడప్పుడు తెలుగు ప్రముఖ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నటించే అవకాశం ఇవ్వాలని అడుగుతుంటానని కూడా చెప్పుకొచ్చింది.దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రభాస్ క్రేజ్ దేశ వ్యాప్తంగా ఏ రేంజ్ లో ఉందో అని.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రాలలో నటిస్తున్నప్పటికీ సాహో చిత్రం తర్వాత కనీసం ఒక్క సినిమా కూడా విడుదల కాకపోవడంతో ప్రభాస్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.కాగా ప్రస్తుతం ప్రభాస్ తెలుగులో ప్రముఖ దర్శకుడు కేకే రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న “రాధే శ్యామ్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.దాంతో మహానటి మూవీ ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న మరో సైన్స్ ఫిక్షన్ చిత్రం లో కూడా ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు.
కాగా ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ “దీపికా పదుకొనే” నటిస్తోంది.అలాగే ఈ చిత్రం బడ్జెట్ దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు సమాచారం.