సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు దివంగత రాజకీయ నాయకుల గురించి బయోపిక్ చిత్రాలు ఎన్నో వచ్చాయి.ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో బయోపిక్ చిత్రం తెరకెక్కడానికి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు.
కొన్ని సంవత్సరాల పాటు భారత దేశ రాజకీయాలలో ఏక చక్రాధిపత్యం వహించిన, భారత రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసిన ఉక్కు మహిళగా పేరు గాంచిన ఇందిరాగాంధీ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తాజా సమాచారం.అయితే ఈ సినిమాలో ఇందిరాగాంధీ ప్రధాన పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయం ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ సినిమాలో ఇందిరాగాంధీ టైటిల్ రోల్ ను పోషించేది మరెవరో కాదు.నిత్యం సోషల్ మీడియాలో వివాదాలను సృష్టిస్తూ కాంట్రవర్సీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న కంగనా రనౌత్.
ప్రస్తుతం ఈ కాంట్రవర్సి హీరోయిన్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ చిత్రంలో నటిస్తుండగానే, ఇందిరా గాంధీ బయోపిక్ తెరపైకి వచ్చింది.
అయితే ఈ బయోపిక్ లో కంగనా రనౌత్ నటిస్తున్నారనే సమాచారం వినబడటంతో దీనిపై కంగనా స్పందిస్తూ… అవును ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాం అంటూ ఈ సినిమా గురించి స్పష్టత ఇచ్చారు.
కంగనా రనౌత్ మాట్లాడుతూ ఇది ఇందిరా గాంధీ బయోపిక్ కాదని, ఇదొక పీరియాడికల్ సినిమా.కేవలం పొలిటికల్ డ్రామా.ఈ చిత్రం ద్వారా భారతీయ రాజకీయాల స్వరూపాన్ని నేటి తరానికి తెలియజేస్తామని, ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ తుది దశలో ఉందని ఈ సందర్భంగా కంగనా రౌనత్ తెలియజేశారు.
ఇక భారత రాజకీయాలలో ఇందిరాగాంధీ పాత్ర అమోఘమని తెలియజేశారు, ఈ సినిమాలో కంగనా లీడ్ రోల్ పోషించగా ఇతర నటులు పలు కీలక పాత్రలో నటించనున్నారు.అయితే ఈ సినిమాలో ఎవరు ఏ పాత్రలో నటిస్తున్నారు అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందేనని ఈ సందర్భంగా తెలియజేశారు.