బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం రోజుకొక మలుపు తిరుగుతుంది.ముఖ్యంగా బాలీవుడ్ లో నెపోటిజం పై చాలా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ఈ విషయంలో బాలీవుడ్ అందాలభామ, ఫైర్ బ్రాండ్ గా పిలవబడే కంగనా రనౌత్ బాలీవుడ్ పెద్దలను సమయం చూసి వారిపై ఫైర్ అవుతూనే ఉంది.
ఇక తాజాగా కంగనారనౌత్ ను ముంబైకి రావద్దని బెదిరించినట్లు ఆవిడ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
ఇందుకు సంబంధించి శివసేన పార్టీ కీలక నేత పార్లమెంటు సభ్యుడు అయిన సంజయ్ రౌత్ తనని ముంబైకి తిరిగి రావద్దంటూ బెదిరించినట్లు కంగన తెలిపింది.అయితే ఈ విషయం సంబంధించి తాజాగా భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రవేశ్ సాహెబ్ సింగ్ మాట్లాడుతూ… ముంబై మహానగరం ఎవరికి సొత్తు కాదని, నగరంలో ఏం జరుగుతోందని ఆయన ప్రశ్నించాడు.
ఇక ఈ విషయంపై తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ట్విట్టర్ వేదికగా మరో ట్వీట్ వదిలింది.ఇక అందులో తనని చాలామంది ముంబైకి తిరిగి రావద్దని బెదిరిస్తున్నట్లు తెలియజేశారు.
ఇలా బెదిరిస్తున్నారు కాబట్టే.తాను వచ్చేవారం సెప్టెంబర్ 9న ముంబై నగరానికి రావడానికి నిర్ణయించుకున్నట్లు తెలియజేశారు.
తాను ముంబై నగరం లోని విమానాశ్రయంలో అడుగు పెట్టే సమయాన్ని కూడా పోస్ట్ చేస్తానని… ” ఎవరికైనా దమ్ముంటే ఆపుకోండి “ అంటూ కంగనా ట్విట్టర్ వేదికగా ఓపెన్ సవాల్ విసిరింది.ఇంత ఘాటుగా ట్విట్టర్ వేదికగా తాను తెలపడంతో ఇప్పుడు ఆమె ముంబై కి వచ్చినప్పుడు ఎవరైనా అడ్డుకుంటారో లేదా అనేది వేచి చూడాలి మరి.