బాలీవుడ్ నటి కంగనారనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో బాలీవుడ్ లో నెపోటిజం ఉందని, తమకు నచ్చిన వారికే అవకాశాలు ఇస్తున్నారని కంగనా తీవ్ర స్థాయిలో మండిపడింది.
అయితే ఈ సందర్బంగా మహేష్ భట్, అలియాభట్, కరణ్ జోహార్ లపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.తరువాత మహారాష్ట్ర ప్రభుత్వంపై కూడా నిప్పులు చెరగడం, మహా ప్రభుత్వం కంగనా ఆఫీస్ మీద దాడి చేయడం ఇలా చాలా ఘటనలు జరిగాయి.
ఇవి దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించాయో మనం చూసాం.అయితే తాజాగా మాహాత్మాగాంధీ పై కంగానా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసారు.ఒక భర్తగా మహాత్మాగాంధీ ఫెయిల్ అయ్యాడని, మహాత్మాగాంధీ తన భార్య, బిడ్డలను వీధించే వాడని ప్రచారంలో ఉందని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.అంతేకాక తన భార్యను ఇంట్లో నుండి గెంటి వేసినట్లు ఆధారాలు ఉన్నాయని, గొప్ప నాయకుడిగా నైతే పేరు తెచ్చుకున్నాడని, కాని మంచి తండ్రి, భర్తగా కాలేకపోయాడని కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది.
అయితే ప్రస్తుతం కంగనా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది.తక్షణమే తన వ్యాఖ్యలను కంగనా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.