బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తో సినిమా అంటే దర్శకులు దేనికి అయినా సిద్దంగా ఉండాలి.అలా కాదని ఆమె ముందు కాస్త క్రియేటివిటీని ప్రదర్శించాలని చూస్తే ఖచ్చితంగా ఆమె వల్ల పరాభవం తప్పదు.
మణికర్ణిక సినిమా విషయంలో క్రిష్ కు ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆమె కథ, కథనం, దర్శకత్వం ఇలా అన్ని విషయాల్లో కూడా తన వేలు పెట్టేందుకు ప్రయత్నిస్తుంది.
ఆ విషయంలో ఎన్ని విధాలుగా ఆమెను తప్పించేందుకు ప్రయత్నించినా కూడా దర్శకులు పరాభవం తప్పదు.ఆమె నిర్ణయానికి ఒప్పుకోకుంటే మాత్రం సినిమా నుండి అర్థాంతరంగా తప్పుకోవడం లేదంటే మొత్తం సినిమాను తన హ్యాండోవర్ లోకి తీసుకోవడం చేస్తుంది అనడంలో సందేహం లేదు.
తాజాగా తలైవి సినిమా విషయంలో కూడా ఆమె అదే పని చేస్తుందని విజయ్ మొత్తుకుంటున్నాడట.
తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం తలైవి సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.
ఈ సమయంలో రషెష్ చూసిన కంగనా కొన్ని సీన్స్ విషయంలో సంతృప్తి చెందక పోవడంతో మళ్లీ రీ షూట్ చేయాల్సిందిగా డిమాండ్ చేసిందట.ఈ విషయంలో విజయ్ నో చెప్పాడట.
దాంతో ఆయనను కాదని షూటింగ్ కు రెడీ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.ఇదే సమయంలో ఎడిటింగ్ విషయంలో కూడా తనదే పై చేయి అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన సీన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది.తాను అనుకున్నట్లుగానే కథను తయారు చేయించుకున్న కంగనా ఇప్పుడు ఎడిటింగ్ విషయంలో కూడా దర్శకుడికి స్వేచ్చ ఇవ్వడం లేదు అనే ప్రచారం జరుగుతోంది.
ప్రేక్షకులు మాత్రం ఎవరు ఎడిట్ చేస్తే ఏంటీ అమ్మ కథను బాగా చూపిస్తే మాకు ఓకే అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.