బాలీవుడ్లో ఫైర్ బ్రాండ్ గా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్న నటి కంగనా రనౌత్.ఈ భామ సినిమాలతో పెద్ద గుర్తింపు సొంతం చేసుకుందో అదేస్థాయిలో వివాదాలతో కూడా ఎక్కువగా గుర్తింపు సంపాదించింది.
బాలీవుడ్లో తరచుగా వివాదాలతో సావాసం చేసే హీరోయిన్ గా కంగనా రనౌత్ మీద ముద్ర పడిపోయింది.ఎప్పుడు ఎవరో ఒకరితో కయ్యం పెట్టుకోవడం.
నోటికి వచ్చినట్లు విమర్శలు చేయడం ఈమెకి అలవాటుగా మారిపోయింది.ఈ కారణంగానే బాలీవుడ్ లో ఎవ్వరు కూడా కంగనా రనౌత్ జోలికి వెళ్లొద్దు ఇష్టపడరు.
అయితే మాత్రం అందర్నీ అదేపనిగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది.అలాగే రాజకీయ విషయాలపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్ట్లు పెట్టడం పరిపాటిగా మారిపోయింది.
అయితే ఈమె ఏమి చేసినా సమర్థించాలనే అభిప్రాయం ఉంటుంది.
ఈమెకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, కామెంట్ చేసిన ఎదురు దాడి చేస్తుంది.
తాజాగా ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం గురించి ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.రైతు ఉద్యమంలో పాల్గొన్న వారందరూ ఉగ్రవాదులంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాజాగా హాలీవుడ్ మోడల్ రైతు ఉద్యమం గురించి పెట్టిన పోస్ట్ పై కౌంటర్ ఇచ్చింది.అయితే బాలీవుడ్లో రైతు ఉద్యమాన్ని సమర్థించే విధంగా తాప్సీ కూడా పోస్టు పెట్టింది.
దీంతో కంగనా రనౌత్ తాప్సిపై నోరు పారేసుకుని ఆమె బి గ్రేడ్ నటి అంటూ కామెంట్స్ చేసింది.అలాగే తను అనుకరించడం ద్వారా ఫేమస్ అయిన కాపీ నటి అంటూ కామెంట్స్ చేసింది.
దీని పై తాప్సీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యింది.కంగనా రనౌత్ డీఎన్ఏ విషపూరితం అని కామెంట్స్ చేసింది.
ఆమె స్వభావం అంతే అంటూ విమర్శలు చేసింది.