కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నప్పటికి తెలుగు దేశం పార్టీ నాయకులు వైకాపా వేదింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తున్నారు.ఇక వైకాపా నాయకులు తెలుగు దేశం పార్టీ నుండి కోడెలను సస్పెండ్ చేసేందుకు రంగం సిద్దం అయ్యింది.
అందుకే ఆ బాధను తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ వైకాపాకు చెందిన వారు కామెంట్స్ చేస్తున్నారు.ఇలాంటి సమయంలోనే కోడెలకు మేనత్త కొడుకు అయిన కంచేటి సాయి సంచలన ఆరోపణలు చేస్తున్నాడు.
గత నెలలో కోడెల శివ ప్రసాదరావు గారు నాకు కాల్ చేశారు.ఆ సమయంలో నాతో ఆయన తన కుమారుడి గురించి పదే పదే చెప్పారు.కోడెల కుమారుడు శివరాం ఆస్తి విషయంలో గొడవ పడుతూ ఉండేవాడట.కోడెల పేరుమీదున్న ఆస్తిని శివరాం రాయించుకునేందుకు బలవంతంగా ప్రయత్నించాడంటూ కంచేటి సాయి ఆరోపిస్తున్నాడు.
గుంటూరు జిల్లాలో పోలీసులకు సాయి ఫిర్యాదు కూడా చేశాడు.సాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.