ఒక్కోసారి కొంతమంది నటీనటులకు నటనా ప్రతిభ, అందం, అభినయం వంటివి మెండుగా ఉన్నప్పటికీ తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం రాకపోవడంతో గుర్తింపు తెచ్చుకోలేక పోతుంటారు.ఈ క్రమంలో అవకాశాలు రాక ఇబ్బందులు పడుతుంటారు.
తెలుగులో ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మరియు యంగ్ హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన “కంచె” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “ప్రగ్యా జైస్వాల్” కూడా ఈ కోవకే చెందుతుంది.అయితే ఈ అమ్మడికి ప్రతిభ బాగానే ఉన్నప్పటికీ కెరియర్లో సరైన హిట్ లేక పోవడంతో ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా కష్ట పడుతుంది.
కాగా ఆ మధ్య ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన గుంటూరోడు, నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర, తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు అవకాశాల కోసం గ్లామర్ ట్రీట్ చేస్తోంది.
కాగా ఈ మధ్య ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.అయితే తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఫోటోలు కారణంగా మరోమారు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఇందులో ప్రగ్యా జైస్వాల్ ఘాటుగా అందాలు ఆరబోస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.దీంతో ఈ అమ్మడి అందాల ఆరబోతకు నెటిజన్లు ఫిదా అయ్యారు.అంతేకాకుండా ఈ ఫోటోలను షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే లక్ష పైచిలుకు లైకులు, కామెంట్లు వచ్చాయి.అంతేగాక ప్రగ్యా జైస్వాల్ ప్యాంటు ధరించింది కానీ గుండీలు పెట్టుకోవడం మర్చి పోయిందంటూ కొందరు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ తెలుగులో టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ మరియు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “అఖండ” చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి దాదాపుగా 60 శాతం షూటింగ్ పనులు పూర్తయినట్లు సమాచారం.దీంతో ఈ చిత్రాన్ని “దసరా” కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.కాగా “అంటిం : ది ఫైనల్ ట్రూత్” అనే హిందీ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.