రెండు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన లారెన్స్ ‘కాంచన 3’ చిత్రం అన్ని ఏరియాల్లో కూడా మంచి వసూళ్లను రాబడుతూ ఉంది.ఇప్పటికే 100 కోట్ల రూపాయలను వసూళ్లు చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
ఇక ఎవెంజర్స్ వచ్చిన తర్వాత ఈ చిత్రం వసూళ్లు తగ్గుతాయని అంతా భావించారు.కాని అనూహ్యంగా ఈ చిత్రంకు కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదు.
తెలుగు రాష్ట్రాల్లోని బి, సి క్లాస్ ఆడియన్స్ నుండి భారీ మొత్తంలోనే వసూళ్లు వస్తున్నాయి
లారెన్స్ నటించిన ‘కాంచన 3’ చిత్రం అన్ని ఏరియాల్లో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది.ఇక నైజాం ఏరియాలో కనీ విని ఎరుగని విధంగా ఈ చిత్రం ఏకంగా 5.5 కోట్ల రూపాయలను వసూళ్లు చేయడం జరిగింది.నైజాం ఏరియాల్లో ఈ చిత్రం కేవలం రెండు కోట్లకు అమ్ముడు పోయింది.ఆ రెండు కోట్లను రాబట్టడం గగనం అనుకుంటున్న సమయంలో ఏకంగా 5.5 కోట్ల రూపాయల షేర్ను రాబట్టి ఔరా అనిపించుకుంది
చిన్న హీరోల డైరెక్ట్ సినిమాలు కూడా ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టలేవు.కాని ఈ చిత్రం మాత్రం ఇంత భారీగా వసూళ్లను రాబట్టడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది.తప్పకుండా ఈ చిత్రం మరింతగా వసూళ్లను రాబడుతాయని ఆశిస్తున్నారు.ఈనెల 9వ తారీకున ‘మహర్షి’ చిత్రం రాబోతుంది.అప్పటి వరకు కాంచన 3 చిత్రం దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన వసూళ్లు లాభాల్లో నడుస్తున్నాయి.మొత్తానికి అన్ని విధాలుగా లారెన్స్ లక్కీగా ఉన్నాడు.