సినీ ఇండస్ట్రీలలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది.ఈ క్రమంలోనే వారిపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్స్ చేస్తూ ఉంటారు.
సెలబ్రిటీలు కూడా నెటిజన్ ల విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.పెళ్లికి ముందు కొన్నేళ్లపాటు డేటింగ్ చేసిన కొంతమంది పెళ్లి తర్వాత కొన్నేళ్లకే విడాకులు తీసుకుంటున్నారు.
అయితే కేవలం సినీ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా సాధారణ వ్యక్తులు సైతం ఇలాగే చేస్తున్నారు.పెళ్లిళ్లు చేసుకుని అనంతరం చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు.
తాజాగా హిందీ సీనియర్ నటి మహిళల ఎంపవర్మెంట్ గురించి కాస్త ఘాటుగా స్పందించింది.బాలీవుడ్ సీనియర్ నటి కామ్యా పంజాబీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ఫీలింగ్స్ షేర్ చేసుకుంటూ ఉంటుంది.సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు చేరువలో ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
నువ్వు నీ మొదటి పెళ్ళి బంధాన్ని కాపాడుకోలేదు.
విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకున్నావు.నీకు హద్దు అదుపు లేదా? అంటూ ఒక ప్రబుద్ధుడు ట్రోల్ చేశాడు అంటూ ఆమె తెలిపింది.ఈ విషయంపై కామ్య ఘాటుగా స్పందిస్తూ.
మహిళ సంతోషంగా ఉండకూడదా? విడాకుల తరువాత చనిపోవాలా? డివర్స్ తర్వాత కూడా జీవితం ఉంటుంది అన్న ఆలోచనలు ఏర్పరుచుకోండి.మేము బలవంతులమే.
మేము కూడా ఫైట్ చేయగలము.అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ఈమె బిజినెస్ మెన్ బంటీ నెగి నుంచి 2013లో విడాకులు తీసుకుంది.అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్న ఆమె గత ఏడాది శలాబ్ దంగ్ నీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే
.