ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే.చైనాలో ప్రాణం పోసుకున్న ఈ మహమ్మారి ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టేస్తుందని ఎవరూ ఊహించలేదు.
ఇక ఈ కరోనాను నుంచి రక్షణ పొందాలంటే.మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడడంతో పాటు శరీర రోగ నిరోధక శక్తి పెంచుకోవడం కూడా ముఖ్యంగా మారింది.
ఈ క్రమంలోనే ప్రజలు ఇమ్యూనిటీ పెంచుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఓ హోటల్ వినూత్న ప్రయత్నం చేసింది.ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే ఈ ఆయుర్వేదిక్ చికెన్ ధమ్ బిర్యానీ తినండంటూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఐస్ లాండ్ హోటల్ నిర్వాహకులు ప్రకటించారు.
దీంతో ఆకర్షితులైన ప్రజలు ఈ ఆయుర్వేదిక్ చికెన్ ధమ్ బిర్యానీని ఓ పట్టు పట్టేయాలంటూ ఎగబడుతున్నారు.ఇంతకీ ఈ బిర్యానీలో ఏం వేస్తున్నారు.దీని స్పెషాలిటీ ఏంటంటే.
శరీర రోగనిరోధక శక్తి పెంచే దాల్చిన చెక్క, సొంఠి, లవంగాలు, మిరియాలు, జీరా, ఉసిరి, తులసీ పౌడర్, సహా అన్ని మూలికలు వేసి ఆయుర్వేదిక్ బిర్యానీ గా తయారు చేసి అమ్ముతున్నారు.
ధర విషయానికి వస్తే.సింగిల్ కి రూ.140గా నిర్ణయించారు నిర్వాహకులు.అటు ఆరోగ్యం, ఇటు రుచి రెండు కలిసి రావడంతో.చుట్టు ప్రక్క గ్రామాల వారు ఈ ఆయుర్వేదిక్ చికెన్ ధమ్ బిర్యానీ కోసం క్యూ కడుతున్నారు.దీంతో సదరు హోటల్ లాభాలు రెట్టింపు అయ్యాయి.