మే 28వ తారీకు నూతన పార్లమెంటు( New Parliament ) భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే.ప్రధాని మోడీ( PM Modi ) చేతుల మీదగా నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు.
ఈ క్రమంలో రాజ్యాంగ ప్రకారం రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోడీ ప్రారంభించడంపై వివిధ పార్టీల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.తాజాగా ఇదే రీతిలో మక్కల్ నిధి మయ్యం కమల్ హాసన్( Kamal Haasan ) ప్రశ్నించడం జరిగింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ఎందుకు పిలవలేదని ప్రధాని మోడీని కమల్ ప్రశ్నించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం వెనక ఎలాంటి కారణం కనిపించడం లేదని తెలియజేశారు.రాజకీయ విభేదాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనాలని విపక్షాలను కోరారు.రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోడీ నూతన పార్లమెంట్ ప్రారంభించడంపై దేశవ్యాప్తంగా 21 పార్టీలు ఈ కార్యక్రమాన్ని బాయ్ కట్ చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే ద్రౌపది ముర్ము ఆదివాసి.ఆదర్శవంత మహిళా అని బీజేపీ వాళ్లు రాష్ట్రపతి చేశారు.మరి అలాంటప్పుడు నూతన పార్లమెంట్ భవనానికి ఎందుకు ఆహ్వానించలేదు ఆమె విధవ కాబట్టే….ఆహ్వానించలేదా.? బీజేపీ వాళ్లకి సెంటిమెంట్ లు రకరకాల పద్ధతిలో ఉంటాయి అంటూ సీపీఐ నారాయణ తన అనుమానాన్ని వ్యక్తం చేశారు.